Featured

Analyst Damu Balaji : అరవై సీట్లు ఇస్తేనే టీడీపీ తో పొత్తు… పవన్ కళ్యాణ్ ట్విస్టు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాలలో మూడు ప్రాంతీయ పార్టీల ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ఒకవైపు జగన్ మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా అంటుంటే మరోవైపు చంద్రబాబు ఈసారి మీకా ఛాన్స్ ఉండదు మేమే వస్తాం అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా నేనూ సీఎం అభ్యర్థినే నన్ను చట్టసభలకు పంపండి అంటూ మాట్లాడుతున్నానరు. అయితే వైసీపీ ని ఓడించాలంటే ఈసారి ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలి అలా అయితేనే వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది. లేదంటే జగన్ కు ప్లస్ అవుతుంది అనే విశ్లేషణల నడుమ పొత్తు గురించి జనసేనాని ఆసక్తికర కామెంట్స్ చేసారు. వాటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అన్ని సీట్లు ఇస్తేనే పొత్తు లేదంటే లేదు…

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి బస్సు యాత్ర ద్వారా జనాలతో మమేకం అవుతున్నారు. జనాల నుండి మంచి స్పందన వస్తోంది అంటూ బాలాజీ తెలిపారు. అయితే టీడీపీ తో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులేస్తున్నారు. సీట్లు ఎక్కువ ఇస్తేనే పొత్తు లేదంటే ఒంటరిగా వెళ్తాను అన్నట్లుగా జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోందని బాలాజీ తెలిపారు.

అయితే చంద్రబాబు మాత్రం పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ ను తొందరపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ముందస్తుకు జగన్ వెళ్తాడంటూ పదే పదే అంటున్నారని బాలాజీ తెలిపారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పవన్ కి అలాగే బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటే వాళ్లకు ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏ నియోజకవర్గాలు ఇవ్వాలి అనే విషయాలు ఆల్రెడీ చంద్రబాబు ప్లాన్ చేసిపెట్టారని బాలాజి తెలిపారు. అయితే పవన్ మాత్రం కర్ణాటక లో కుమారుస్వామి లాగా సీట్ల విషయంలో రాజీ పడకుండా అవకాశం వస్తే సీఎం కావాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

8 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

8 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

8 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

8 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

8 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

8 hours ago