Narasimha Raju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. నరసింహ రాజు గారి తండ్రి దాన ధర్మాలు బాగా చేసి ఆస్తులన్నీ అయిపోగొట్టడం, సినిమాల మీద మక్కువతో నరసింహా రాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. నీడ లేని ఆడది వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహ రాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.
తెలియక వాళ్ళు చేస్తున్న పనిని కామెంట్ చేసాను…
ఆంధ్ర కమల్ హాసన్ గా బిరుదు తెచ్చుకున్న నరసింహ రాజు గారు సినిమాల్లో అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. పలు సీరియల్స్ లో కూడా నటించారు. ముఖ్యంగా పలు తమిళ సీరియల్స్ లో నటించి పేరు తెచ్చుకున్నారు. 1974లో నీడ లేని ఆడది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరసింహ రాజు గారు విఠలాచార్య గారి జానపద సినిమాలలో దాదాపు 12 సినిమాలను చేశారు. ఇక దాసరి నారాయణరావు గారి సినిమాల్లో కూడా ఎక్కువగా నటించిన నరసింహ రాజు గారు దివిసీమ ఘటన సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అగ్ర హీరోలైనా జోలె పట్టి చందాలు వసూలు చేసి అక్కడి ప్రజలకు సదుపాయాలను కల్పించారు.
అయితే అలా అగ్ర హీరోలు జోలె పట్టే సమయంలో నరసింహ రాజు గారు వీళ్ళు అగ్ర హీరోలు కదా వీళ్లేందుకు చందాలు వసూలు చేస్తున్నారు, వాళ్ళే కొంత డబ్బు విరాళం ఇస్తే అయిపోతుంది కదా, జనాల్లోకి వెళ్లడం ఎందుకు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. కానీ అది తప్పు అని మళ్ళీ అర్థమైంది అప్పుడు అల్ప జ్ఞానంతో అవగాహన లేక అలా మాట్లాడను కానీ ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ ఆ సంఘటన తరువాత కలిసినా ఆ కామెంట్స్ మీద స్పందించలేదు, పట్టించుకోలేదు నన్ను ఆప్యాయంగా మాట్లాడించారు అంటూ నేను సక్సెస్ ఫుల్ హీరో అయ్యాక అర్థమైంది జనాల్లోకి వెళ్లి మాట్లాడటం ఎంత కష్టమైన పనో, నేను ఎంత తప్పుగా మాట్లాడానో అంటూ చెప్పారు. ఇక అలాంటి కామెంట్స్ చేసిన తనకు ఆఫర్స్ తగ్గడం అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. రానురాను హీరో వేషాలే మనకు ఎపుడూ రావు కదా, అలా అవకాశాలు సన్నగిళ్లడంతో ఇక సీరియల్స్ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగాను చేశాను అంటూ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…