Rashmika: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి తరచూ అనేక రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి రూమర్ల గురించి కొందరు సెలబ్రిటీలు స్పందిస్తూ వాటిని ఖండిస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ఇలాంటి రూమర్ల గురించి పట్టించుకోకుండా వారి షూటింగ్ పనులతో వారు బిజీగా ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక విషయంలో కూడా హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఇలాగే వ్యవహరించాడు.హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.’ దొరసాని ‘ సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమైన ఆనంద్ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా ద్వారా హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత ఆనంద్ హీరోగా వచ్చిన ‘ పుష్పకవిమానం ‘ సినిమా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఆనంద్ ‘ బేబీ ‘ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులతో ఆనంద్ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆనంద్ అసహనం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక విలేకరి ” మీ సినిమాలోని ఓ పాట ని రష్మిక రిలీజ్ చేశారు కదా. ఆ సాంగ్ ఈవెంట్కి వచ్చిన వాళ్లందరూ ఆమెను ‘వదినా’ అని గట్టిగా పిలిచారు కదా..’’ అని ప్రశ్న అడిగాడు.. దీంతో ఆనంద్ స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నో.. నేను దీన్ని ఇక్కడితో ఆపేస్తాను’’ అని సమాధానం ఇచ్చాడు. అంటే రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి వినిపిస్తున్న వార్తలపై స్పందించడానికి ఆనంద్ ఆసక్తి చూపటం లేదు. దీంతో వారిద్దరి నిజంగానే రిలేషన్ లో ఉన్నారా? లేదా? అనే అనుమానం ఇంకా అలాగే ఉంది.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…