Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరవ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం, ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంటూ విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ, వివేకానంద రెడ్డి చెల్లి విమలా రెడ్డి పరామర్శించారు. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తీర్పును తాజాగా బుధవారం నాడు వెల్లడించింది. అయితే అంతకు నాలుగు రోజుల ముందు వాదనలు విన్న హై కోర్ట్ జడ్జి కొన్ని కామెంట్స్ చేసారు. వాటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నా మీద ఒత్తిడి తెస్తున్నారు…
జస్టిస్ లక్ష్మణ్ గారు అవినాష్ కు బెయిల్ మంజూరు చేసే ముందు సిబిఐ వాదనలు, అలాగే సునీత తరుపు లాయర్ అలాగే అవినాష్ తరుపు లాయర్ వాదనలను విన్నారు. ఇక సిబిఐ తరుపు లాయర్ కి దాదాపు 16 ప్రశ్నలను వేయగా వాటికి సిబిఐ నుండి సరైన సమాధానం రాలేదని బాలాజీ తెలిపారు. ఆ తరువాతే ఆయన అవినాష్ కు బెయిల్ మంజూరు చేసారు. అయితే బెయిల్ కు కొన్ని షరతులు విధించారు.
కేసుకు సంబంధించిన ఎవరైనా నిందితులను ప్రభావితం చేసినా లేక సిబిఐ విచారణకు ప్రతి శనివారం హాజరు కాకపోయినా బెయిల్ రద్దుకు సిబిఐ కోర్ట్ ను ఆశ్రయించవచ్చని తెలిపారు. ఇక జస్టిస్ మీడియా గురించి మాట్లాడుతూ ఏబిఎన్ అలాగే మహా అనే మీడియా సంస్థలు నిర్వహించిన డిబేట్స్ కారణంగా తాను ఒత్తిడి గురయ్యానని నేను అమ్ముడుబోయానంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయంటూ పేర్కొన్నారు. వాటి ఫుటేజ్ ను కోర్ట్ కి ఇచ్చి పరిశీలించాలని అదేశించారంటూ బాలాజీ తెలిపారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…