Analyst Damu Balaji : హీరోగానూ, విలన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు శరత్ బాబు గారు అనారోగ్య సమస్యల్తో చికిత్స అందుకుంటూ తుది శ్వాస విడిచారు. దాదాపు నేల పైగానే హాస్పిటల్ లో ఉన్న ఆయన చెన్నై నుండి బెంగళూరు ఆ తరువాత హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. 72 ఏళ్ల వయసులో శరత్ బాబుగారు మృతి చెందారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నటి రమాప్రభ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 15 ఏళ్ల తరువాత విడిపోయిన ఆయన మళ్ళీ తమిళ నటిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. చాలా ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న శరత్ బాబు గారికి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు దాదాపు 13 మంది ఉన్నారు. ఇక వారి కుటుంబ గురించి ఆస్తి గొడవల గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.
డైరీలో ఏముందంటే…
శరత్ బాబు గారికి సంతానం లేకపోవడం వల్ల ఆయన అన్నదమ్ముల పిల్లలను చేరదీసారట. వారి చదువులు అన్ని విషయాలు ఆయనే చూసుకుని ఆస్తి కూడా 13 బాగాలను చేసి అందరికీ పంచారట. తనకంటూ కొంత ఆస్తి పెట్టుకుని మిగిలినది అందరికీ ఇచ్చేసినా ఇప్పుడు మిగిలిన ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయనే పుకార్లు వినపడుతున్నాయని అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు. తాజాగా ఆయన డైరీ ఒకటి దొరిందని, అందులో ఆస్తికి సంబంధించిన విషయాలను రాసుకొచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు.
నిజానికి శరత్ బాబు గారికి డైరీ రాసే అలవాటు ఉంది కానీ ఆయన రాస్తున్న డైరీ ఇప్పటికీ ఎవరికీ అందలేదు. అదీకాక ఆయన ఎలాంటి వీలునామా కూడా రాసినట్లుగా కనిపించడం లేదంటూ బాలాజీ తెలిపారు. ఆస్తులన్నీ ఆల్రెడీ ఇచ్చేసినా తనకంటూ హైదరాబాద్ లో ఒక ఇల్లు, మదనపల్లి లో ఒక అతిధి గృహం, చెన్నై లో ఇల్లు కొన్ని షాప్స్ పెట్టుకోగా వచ్చే రెంట్స్ కూడా తన సోదరుల పిల్లలకోసం ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు ఈ మిగిలిన ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు బాలాజీ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…