Featured

Analyst Damu Balaji : జయలలిత, శశికళ స్నేహం… జయలలిత మరణం వెనుక శశికళ హస్తం??: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : సినిమా తారగా ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ గా అగ్రస్థానంలోకి అడుగుపెట్టిన అందలంతార జయలలిత. అయితే ఆమె సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ అలాగే ఎదిగారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరుగు లేని విజయాలను చూసిన జయలలిత 2016 డిసెంబర్ లో అనారోగ్య కారణాలతో మరణించారు. ఆమె మరణం కూడా పెద్ద వివాదాలకు దారి తీసింది. ఆమె ఎపుడో చనిపోతే కావాలనే అది దాచి పెట్టి రాజకీయం చేశారని, శశికళ జయలలిత మరణానికి కారణం అని పలు వాదనలు వినిపించాయి. చివరికి తమిళనాడులో కొత్తగా ఏర్పడిన స్టాలిన్ ప్రభుత్వం ఆమె మరణం మీద విచారణ జరుపడానికి కమిషన్ ఏర్పాటు చేయగా ఆ కమిషన్ శశికళను కూడా విచారించాలని కోరింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మరిన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.

అమ్మ, చినమ్మ స్నేహం…

జయలలిత గారు ఎంజీఆర్ మరణించాక పలు సంక్షోభాల నడుమ సీఎం అయ్యారు. ఎంజీఆర్ ఉన్న సమయంలోనే జయలలితకు శశికల పరిచయం ఉంది. నిజానికి జయలలిత మీద నిఘా పెట్టడం కోసం శశికళ ను ఏర్పాటు చేశారనే వాదన ఉంది అంటూ బాలాజీ తెలిపారు. ఇక జయలలిత సీఎం అయ్యాక శశికళ అన్నీ తానై రజ్యంగేతర శక్తిగా తయారైంది అంటూ తెలిపారు. అయితే ఒకానొక సమయంలో జయలలితను మించి శశికళ ఎదిగారు, ప్రభుత్వంలో ఏం జరగాలి అన్నాకూడా శశికళ కనుసన్నల్లోనే జరిగేది అంటూ తెలిపారు.

ఇక మన్నర్ గుడి మాఫియా లాగా శశికళ ఆమె బంధువులు తయారయ్యారు, ఒక కోటరీ లాగా జయలలిత చుట్టూ చేరారు అంటూ తెలిపారు. ఇక ఆమె మరణం కూడా అంతే వివాదాస్పదమైంది. ఆమె మరణానికి ముందు శశికళ మాత్రమే జయలలిత వద్ద ఉండేది. ఆమెను ఎవరు కలవాలి అన్నా శశికళ అనుమతి ఉండాలి అనే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం జయలలిత మరణం మీద వేసిన కమిషన్ లో శశికళ ను కూడా విచారణ జరపాలి అనే అంశం ఉండడం విశేషం అంటు బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

6 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

1 day ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

1 day ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

1 day ago