Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయన సినీ కెరియర్ లో సూపర్ హిట్ చిత్రమైనటువంటి దేశముదురు సినిమాను తిరిగి విడుదల చేశారు. ఈ సినిమా ఏప్రిల్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాని హైదరాబాద్లోని సంధ్య 70 ఎంఎం థియేటర్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమా చూడటం కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏకంగా థియేటర్లోనే టపాసులు పేలుస్తూ రచ్చ చేశారు. ఇలా ఒక్కసారిగా టపాకాయల మోత మోగడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అరుపులతో, కేకలతో గోల చేశారు.
దీంతో అలర్ట్ అయిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు థియేటర్ వద్దకు చేరుకొని షో ఆపివేయడమే కాకుండా అందరిని థియేటర్ నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని నిర్మాత శ్రీనివాస్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలియజేయడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.
ఈ విధంగా అభిమానులు హీరోల పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకోవడం తప్పు కాదు కానీ థియేటర్లో ఇలాంటి పనులు చేయడం మంచిది కాదని థియేటర్ తమకు ఒక దేవాలయం లాంటిదని ఈయన తెలియజేశారు. దేవాలయాలను సంరక్షించుకుందాం అంటూ శ్రీనివాస్ కుమార్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.సాధారణంగా ఒక హీరో సినిమా వస్తుంది అంటే థియేటర్ ముందు పండగ వాతావరణం ఉండేది అయితే ఈ మధ్యకాలంలో అభిమానులు అత్యుత్సాహం కారణంగా థియేటర్లోనే టపాసులు పేలుస్తూ ఇతర ప్రేక్షకులకు ఇబ్బందికరంగా మారుతున్నారని చెప్పాలి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…