Analyst Damu Balaji : ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఒక వార్త, అది నిజం కాదు అని ఇప్పటి వాళ్లకు తెలియదు నిజం అనడానికి సాక్ష్యం లేదు. అదే దివంగత టీడీపీ అనంతపురం లీడర్ పరిటాల రవి, పవన్ కళ్యాణ్ మధ్య గొడవ, పవన్ కి పరిటాల గుండు కొట్టించడం. ఇప్పటివరకు ఇంకా ఈ రూమర్ అక్కడక్కడా వినిపిస్తూ ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి వైసీపీ వాడుకుంటున్న ఈ వార్తలో ఎంత నిజముంది అనే విషయాన్ని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
స్థలం విషయంలో జరిగింది అది…
నిజానికి స్థలం వివాదంలో జరిగిన గొడవ వల్ల పరిటాల రవి పవన్ కళ్యాణ్ వారి ఊరు వెంకటాపురంకి తీసుకెళ్లి గుండు కొట్టించి పంపారని 1998 ఆ ప్రాంతంలో బాగా రూమర్ వచ్చింది. అయితే నిజానికి అదంతా వట్టి పుకారు మాత్రమే అందులో నిజం లేదని అప్పటి జర్నలిస్ట్ ఇపుడు అనలిస్ట్ గా ఉన్న బాలాజీ తెలిపారు. నిజానికి స్థలం విషయంలో అసలు గొడవ జరగలేదని అయన చెబుతున్నారు. హైదరాబాద్ లో కారు బాంబు దాడి అనంతరం పరిటాల రవి ఇంటి వద్ద సెక్యూరిటీ పెంచాలని భావించి చుట్టూ ఉన్న స్థలాలను కూడా కొనాలని రవి అనుకున్నారు. అలా ఒక స్థలం చిరంజీవి కి సంబందించినది కావడంతో అయనను సంప్రదించి అడిగిన రేటుకే కొన్నారు. అసలు ఎలాంటి వివాదం ఈ విషయంలో జరగలేదు.
ఇక అసలు పరిటాల గారు పవన్ కళ్యాణ్ ఎపుడూ కలిసింది కుడా లేదు. ఇక ఇదే రూమర్ ను పరిటాల గారిని అడిగితే ఆయనే స్వయంగా అలాంటిదేమి లేదు, ఇది టీడీపీ పార్టీ ఆఫీస్ నుండే వచ్చిన రూమర్ అని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్న సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లారు ఆ సమయంలోనే గుండు కొట్టించుకున్నారు అంతే తప్ప అసలు ఈ విషయంలో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు బాలాజీ. కేవలం ప్రస్తుతం ఉన్న రాజకీయ లబ్ది కోసం ప్రత్యర్థులు దీన్ని వాడుకుంటున్నారు. ఇక ఆర్జీవి రక్త చరిత్ర సినిమాలో చూపించడంతో నిజం అనుకుంటున్నారు. కానీ అది ఫేక్ అంటూ చెప్పారు బాలాజీ. ఇక టీడీపీ మరియు చిరంజీవి మధ్య ఎక్కడా విబేధాలు లేవు అంటూ బాలాజీ తెలిపారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…