Analyst Damu Balaji : సమంత ప్రధానపాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాకుంతలం. ఇటీవలే విడుదల అయిన సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇందులో సమంతకు జోడిగా మలయాళం హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. శాకుంతలం సినిమా మహా కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి తీసుకున్న కథ. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ గుణశేఖర్ గారు. ఈ సినిమా తాజాగా విడుదల అయి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే సినిమాలో కొన్ని లోపాలు అలాగే గ్రాఫిక్స్ సరిగా లేకపోవడం వల్ల సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఫలితంతో నాకేం సంబంధం లేదంటూ సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ గారు ఆయన విశ్లేషణ అందించారు.
భగవద్గీత శ్లోకంతో సమంత…
శాకుంతలం సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక సమంత మొహం ఫ్రెష్ గా సినిమాలో అనిపించలేదు. చిన్నవయసు అమ్మాయి అయి ఉంటే శకుంతల పాత్రకు ఇంకా బాగుండేది అన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది అంటూ దాము బాలాజీ మాట్లాడారు. ఇక సినిమా ఫ్లాప్ అవడం గురించి సమంత పరోక్షంగా మాట్లాడటం గురించి ఆయన మాట్లాడుతూ భగవద్గీత లోని ఒక శ్లోకాన్ని చెబుతూ నేను సినిమాలో నటించాను అంతే, సినిమా ఫలితంకి నేను బాధ్యురాలిని కాదు అన్నట్లుగా ఆమె మాట్లాడారు అంటూ అభిప్రాయపడ్డారు.
క్రిస్టియన్ అయిన సమంత ఇలా భగవద్గీత శ్లోకం పెట్టడం, అందులోనూ ఖచ్చితంగా అది శాకుంతలం సినిమా ఫ్లాప్ అవడం గురించే అంటూ చర్చలు నడుస్తున్నాయని బాలాజీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సమంత లండన్ లో సిటడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వెళ్లారు అంటూ చెప్పారు. తన పని తాను చేసుకుపోతానని ఫలితంతో నాకు సంబంధం లేదని చెప్పకనే చెప్పేసింది సామ్.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…