Analyst KS Prasad : ఏపీ రాజకీయాల్లో అపుడే రాజకీయ వేడి మొదలైంది. ఎంఎల్సి ఎన్నికలలో టీడీపీ గెలవడం వైసిపి కి వ్యతిరేకత మొదలైనట్లుగా విమర్శలు వినిపిస్తున్నా మరోవైపు సీఎం ఢిల్లీ టూర్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ టూర్ అంటూ వెళ్ళడంతో రాజకీయంగా ఎపుడు బీజేపీ ఎవరికి సహకరిస్తుంది, పవన్ కు రోడ్ మాప్ ఎలా ఇచ్చింది అలాగే టీడీపీ, జనసేన బంధం ఎలా ఉండబోతోంది అన్న విషయాలు చర్చలకు దారి తీస్తున్నాయి. ఇక ఈ విషయాల మీద అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ మాట్లాడారు.
పవన్ కు జగన్ కి తేడా ఉంది…
పవన్ ఢిల్లీ వెళ్ళింది బీజీపీ వాళ్ళు ఏం చెబితే అది చేయడానికి చిన్న పిల్లాడిలా ఎం చేయలన్నా బీజేపీ పెద్దలను అడుగుతుంటాడు. అందుకే సీఎం జగన్ ను పవన్ తో పోల్చకూడదు. నాకు తెలిసి ఇప్పటికే జనసేన పార్టీని బీజేపీ లోకి విలీనం చేసుంటాడు అంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వం పాలన పనుల మీద ఢిల్లీ వెళ్లారు కానీ పవన్ అలా కాదు వచ్చే ఎన్నికల దిశా నిర్దేశం కోసం వెళ్ళాడు. అతనికి దత్తపుత్రుడు అని నామకరణం చేసింది కూడా జగనే కదా.
చంద్ర బాబు వైపు నుండి వన్ సైడ్ లవ్ ఉంది అని అనుమానం రేకెత్తించి జగన్ వదిలాడు. ఇక పవన్ నిజంగానే చంద్ర బాబు తనను లవ్ చేస్తున్నాడేమో అని వాళ్లకు దగ్గరయ్యాడు. మా చేతులు ఖాళీ లేవు అని చంద్ర బాబు చెప్పినా వినకుండా వాళ్లకు దగ్గరయ్యాడు అంటూ పవన్ ను విమర్శించారు ప్రసాద్. అలా జగన్ పెట్టిన పేరును సార్ధకం చేసుకున్నాడు. ఇక ఢిల్లీ వెళ్లి బీజేపీ తో అక్షింతలు వేయించుకుని వస్తాడు ప్రతిసారీ అంటూ విమర్శించారు ప్రసాద్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…