మల్లేశం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసిన అనన్య నాగవల్లి వకీల్ సాబ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వకీల్ సాబ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ దినేష్ నర్రా దర్శకత్వంలో మార్స్ మూవీ ప్రొడక్షన్ పతాకంపై మునిరత్నం నాయుడు, రాజేశ్వరి నిర్మిస్తున్నటువంటి చిత్రం “ఏవమ్ జగత్” సినిమా నుంచి “రాధాస్ లవ్” అనే పాటను విడుదల చేశారు. ఈ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
కిరణ్ గేయ, ప్రకృతి వనం ప్రసాద్,రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి రాధాస్ లవ్ అనే పాటను వకీల్ సాబ్ హీరోయిన్ అనన్య నాగవల్లి విడుదల చేసారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.”ఉదయించే సూర్యిడిలా ..ప్రతిరోజు నిను చూసా ..”అంటూ సాగిపోయే ఈ పాట ఎంతో అద్భుతంగా వచ్చిందని, శివకుమార్ మ్యూజిక్ ఎంతో అద్భుతంగా ఉందని చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. రాబోయే రోజులలో వ్యవసాయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి .. రాబోయే తరానికి కావాల్సిన ఆహారం పండించగల అనుభవం మన దేశంలోని యువతకు ఉందా.. అనే అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని తెలియజేశారు.
అచ్చమైన పల్లెటూరిలో సాగే ఈ కథ దేశ పురోగతికి అద్దం పడుతుందని, ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది ఏ విధంగా సాధించాడు అనేది ఈ చిత్రంలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలియజేశారు.ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు వెల్లడించారు.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…