Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.ఇలా ఈమె సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా పోస్ట్ చేసిందని భావిస్తున్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతోనే అనసూయ ఇలాంటి ట్వీట్ చేశారని పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు భావిస్తూ అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అనసూయ విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో భాగంగా విజయ్ దేవరకొండ అమ్మ గురించి మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వివాదం సృష్టించాయి. ఆ సమయంలో అనసూయ సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మండిపడ్డారు.
ఇక ఆ విషయం గురించి అందరూ మర్చిపోగా తాజాగా మరోసారి అనసూయ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున వివాదానికి తెర తీశారు.ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా విడుదల కావడం ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ కొన్నిసార్లు రావడం ఆలస్యం కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అంటూ ఈ సందర్భంగా ఈమె ట్వీట్ చేశారు.
ఈ విధంగా అనసూయ ట్వీట్ చేయడంతో ఈమె విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ కావడంతోనే అప్పట్లో అన్న మాటలకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని, పరోక్షంగా తనని ఉద్దేశించే ట్వీట్ చేశారని పలువురు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ సైతం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటమే కాకుండా అలాంటి డైలాగులు వేసినప్పుడు వెకిలి నవ్వులు నవ్వారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా జబర్దస్త్ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాతూ డబ్బు సంపాదించిన అనసూయ ఇప్పుడు నీతులు చెబుతుంది అంటూ విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈమెపై కామెంట్లు చేస్తున్నారు.
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…