Anasuya: జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ వెండితెర రంగమ్మత్తగా అదే స్థాయిలో ఆదరణ అందుకున్నారు. ఇలా వెండితెరపై ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
తాజాగా రంగ మార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఈమె సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.
ఈ క్రమంలోనే కొందరు పుష్ప 2 సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని అడగగా తాను ఇంకా షూటింగ్ లోకేషన్ లోకి అడుగు పెట్టలేదని సమాధానం చెప్పారు.మరొక నేటిజన్ ప్రశ్నిస్తూ అభిమానులు అడిగితే మీరు ఎందుకు వారితో కలిసి ఫోటోలు దిగరు వారి వల్లే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.
మనుషులన్న తర్వాత కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రిటీలైనంత మాత్రాన మేము మనుషులం కాదనుకుంటే ఎలా?నేను చాలామందితో ఫోటోలు దిగాను మీతో దిగలేదని ఇలా జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పారు. ఇలా అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…