Anasuya Sister: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈమె ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయం కానంతవరకు యాంకర్ అంటే ఎంతో హుందాగా ఒంటినిండా దుస్తులు వేసుకొని కనిపించేవారు. అయితే అనసూయ యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ విధంగా జబర్దస్తీ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయకు రోజు రోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఇలా ఈమెకు వచ్చిన పాపులారిటీతో బుల్లితెర అవకాశాలు మాత్రమే కాకుండా వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండడంతో ఈమె పూర్తిగా బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండితెరపై సందడి చేస్తున్నారు.
ఇక అనసూయ యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాలకు దూరం కావడంతో ఈమె లేని లోటు స్పష్టంగా కనబడుతుంది.అయితే అనసూయ తన స్థానాన్ని భర్తీ చేయడం కోసం తన చెల్లెలు వైష్ణవినీ రంగంలోకి దింపుతుందని తెలుస్తోంది. అనసూయకు ఇద్దరు చెల్లెలు ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అచ్చం అనసూయ పోలికలతో ఉన్నటువంటి తన సోదరి వైష్ణవిని యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
జీ తెలుగులో త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఓ కొత్త కార్యక్రమానికి యాంకర్ గా వైష్ణవి పరిచయం కానున్నారట. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనసూయ లేని లోటును వైష్ణవి తీర్చబోతున్నారని,ఇకపై బుల్లితెర కార్యక్రమాలలో వైష్ణవి హవా కొనసాగుతుందని పెద్ద ఎత్తున అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…