Anasuya: బుల్లితెర గ్లామర్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ బాగా క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత అనసూయ పేరు రంగమ్మత్తగా మారిపోయింది. బుల్లితెర మీద ఎంతో గ్లామరస్ గా కనిపించే అనసూయ సినిమాలలో మాత్రం డి గ్లామర్ పాత్రలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలా టీవీ షోలు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్టుల వల్ల విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది.
సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసే వారికి అనసూయ గట్టి కౌంటర్స్ ఇస్తూ ఉంటుంది. ఇలా తరచూ తన పోస్టుల వల్ల వివాదాల్లో నిలిచే ఈమె తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో..” నాకో వ్యాధి ఉంది.నా గురించి చెడుగా మాట్లాడే వారిని నేను అస్సలు పట్టించుకోను.” అంటూ వీడియో షేర్ చేసింది. అనసూయ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా తనని ట్రోల్ చేసేవారికి మరొకసారి అనసూయ ఇలా కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్ల పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొంతమంది మాత్రం ఎప్పటిలాగే అనసూయని ట్రోల్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బుల్లితెరకు దూరమైన అనసూయ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో కూడా కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. అలాగే దర్శకుడు క్రిష్ సమర్పణలో రూపొందుతున్న మరొక వెబ్ సిరీస్ లో కూడా అనసూయ నటిస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…