Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ అనంతరం రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై ఈమె నటనకు మంచి గుర్తింపు రావడంతో వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం వెండితెరకి పరిమితమయ్యారు.
ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. అయితే తనని ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం వారికి తన స్థాయిలో వార్నింగ్ ఇస్తూ అనసూయ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.
ఇలా ఏ విషయం అయినా సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకునే అనసూయ తాజాగా ఒక ఎయిర్ లైన్ సంస్థ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇండిగో విమానయాన సంస్థ పై , సిబ్బంది వ్యవహార శైలిపై అనసూయ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఇండిగో ఎయిర్ లైన్స్ ను ద్వేషిస్తున్నాను. ఇక్కడ దేశీయ ఎయిర్ లైన్స్ వారు ఆధిపత్యం చెలాయించడం విచారకరం. అసలు నాణ్యతలేని సేవలు అంటూ ఈమె విమానయాల సంస్థపై అలాగే సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ చేశారు. అయితే ఈమె ఇలాంటి పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి ఏ విషయంలో ఈమె అసౌకర్యంగా ఫీల్ అయ్యారు అనేది మాత్రం వెల్లడించలేదు మరి ఈమె చేసినటువంటి పోస్టుకు ఇండిగో నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…