Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ అనంతరం రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై ఈమె నటనకు మంచి గుర్తింపు రావడంతో వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం వెండితెరకి పరిమితమయ్యారు.
ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. అయితే తనని ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం వారికి తన స్థాయిలో వార్నింగ్ ఇస్తూ అనసూయ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.
ఇలా ఏ విషయం అయినా సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకునే అనసూయ తాజాగా ఒక ఎయిర్ లైన్ సంస్థ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇండిగో విమానయాన సంస్థ పై , సిబ్బంది వ్యవహార శైలిపై అనసూయ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఇండిగో ఎయిర్ లైన్స్ ను ద్వేషిస్తున్నాను. ఇక్కడ దేశీయ ఎయిర్ లైన్స్ వారు ఆధిపత్యం చెలాయించడం విచారకరం. అసలు నాణ్యతలేని సేవలు అంటూ ఈమె విమానయాల సంస్థపై అలాగే సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ చేశారు. అయితే ఈమె ఇలాంటి పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి ఏ విషయంలో ఈమె అసౌకర్యంగా ఫీల్ అయ్యారు అనేది మాత్రం వెల్లడించలేదు మరి ఈమె చేసినటువంటి పోస్టుకు ఇండిగో నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో తెలియాల్సి ఉంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…