Anchor Rashmi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా నటించే అవకాశం అందుకుంది. జబర్దస్త్ లో యాంకర్ గా మారిన తర్వాత రష్మీ మంచి గుర్తింపు పొందింది. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారం అవుతున్న అనేక టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పండుగ సందర్భాలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో కూడా రష్మీ సందడి చేస్తూ ఉంటుంది.
జబర్దస్త్ యాంకర్ గా కొంతవరకు గుర్తింపు పొందిన రష్మి సుధీర్ ప్రేయసిగా బాగా పాపులర్ అయింది. షో రేటింగ్స్ కోసం మల్లెమాల వారు క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ వల్ల సుధీర్ రష్మీ జంటగా బాగా పాపులర్ అయ్యారు. ఇలా ఒకవైపు టీవీ షో లలో సందడి చేస్తూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. గతంలో రష్మీ నటించిన గుంటూరు టాకీస్ సినిమా హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఇటీవల రష్మీ హీరోయిన్ గా నటించిన మరొక సినిమా కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రష్మీకి సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. తాజాగా శుక్రవారం రోజున రష్మి గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించిన సంగతి రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన గ్రాండ్ మదర్ మరణ వార్త తెలియజేస్తూ రష్మి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
“బరువెక్కిన గుండెలతో కుటుంబమంతా ఆమెకి ఆఖరి సారిగా వీడ్కోలు పలికాము. నువ్వు చాలా స్ట్రాంగ్. నీ ప్రభావం మాపై చాలా ఉంది. ప్రస్తుతం నువ్వు మాతో లేకపోయినా కూడా నీ జ్ఞాపకాలు చిరకాలం మాతోనే ఉంటాయి” అంటూ తన గ్రాండ్ మదర్ ని తలచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ బి స్ట్రాంగ్ రష్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…