Anchor Rashmi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా నటించే అవకాశం అందుకుంది. జబర్దస్త్ లో యాంకర్ గా మారిన తర్వాత రష్మీ మంచి గుర్తింపు పొందింది. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారం అవుతున్న అనేక టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పండుగ సందర్భాలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో కూడా రష్మీ సందడి చేస్తూ ఉంటుంది.
జబర్దస్త్ యాంకర్ గా కొంతవరకు గుర్తింపు పొందిన రష్మి సుధీర్ ప్రేయసిగా బాగా పాపులర్ అయింది. షో రేటింగ్స్ కోసం మల్లెమాల వారు క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ వల్ల సుధీర్ రష్మీ జంటగా బాగా పాపులర్ అయ్యారు. ఇలా ఒకవైపు టీవీ షో లలో సందడి చేస్తూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. గతంలో రష్మీ నటించిన గుంటూరు టాకీస్ సినిమా హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఇటీవల రష్మీ హీరోయిన్ గా నటించిన మరొక సినిమా కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రష్మీకి సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. తాజాగా శుక్రవారం రోజున రష్మి గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించిన సంగతి రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన గ్రాండ్ మదర్ మరణ వార్త తెలియజేస్తూ రష్మి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
“బరువెక్కిన గుండెలతో కుటుంబమంతా ఆమెకి ఆఖరి సారిగా వీడ్కోలు పలికాము. నువ్వు చాలా స్ట్రాంగ్. నీ ప్రభావం మాపై చాలా ఉంది. ప్రస్తుతం నువ్వు మాతో లేకపోయినా కూడా నీ జ్ఞాపకాలు చిరకాలం మాతోనే ఉంటాయి” అంటూ తన గ్రాండ్ మదర్ ని తలచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ బి స్ట్రాంగ్ రష్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…