Connect with us

Featured

Anchor Rashmi: నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి… ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మి!

Published

on

Anchor Rashmi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా నటించే అవకాశం అందుకుంది. జబర్దస్త్ లో యాంకర్ గా మారిన తర్వాత రష్మీ మంచి గుర్తింపు పొందింది. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారం అవుతున్న అనేక టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పండుగ సందర్భాలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో కూడా రష్మీ సందడి చేస్తూ ఉంటుంది.

జబర్దస్త్ యాంకర్ గా కొంతవరకు గుర్తింపు పొందిన రష్మి సుధీర్ ప్రేయసిగా బాగా పాపులర్ అయింది. షో రేటింగ్స్ కోసం మల్లెమాల వారు క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ వల్ల సుధీర్ రష్మీ జంటగా బాగా పాపులర్ అయ్యారు. ఇలా ఒకవైపు టీవీ షో లలో సందడి చేస్తూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. గతంలో రష్మీ నటించిన గుంటూరు టాకీస్ సినిమా హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఇటీవల రష్మీ హీరోయిన్ గా నటించిన మరొక సినిమా కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రష్మీకి సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. తాజాగా శుక్రవారం రోజున రష్మి గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించిన సంగతి రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన గ్రాండ్ మదర్ మరణ వార్త తెలియజేస్తూ రష్మి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Advertisement

Anchor Rashmi: నీ ప్రభావం మాపై చాలా ఉంది..


“బరువెక్కిన గుండెలతో కుటుంబమంతా ఆమెకి ఆఖరి సారిగా వీడ్కోలు పలికాము. నువ్వు చాలా స్ట్రాంగ్. నీ ప్రభావం మాపై చాలా ఉంది. ప్రస్తుతం నువ్వు మాతో లేకపోయినా కూడా నీ జ్ఞాపకాలు చిరకాలం మాతోనే ఉంటాయి” అంటూ తన గ్రాండ్ మదర్ ని తలచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ బి స్ట్రాంగ్ రష్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Featured

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

Published

on

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Advertisement

Continue Reading

Featured

Nagababu: నాగబాబు ట్వీట్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు!

Published

on

Nagababu: సినీ నటుడు నాగబాబు ఇటీవల ఏపీ రాజకీయాలను ఉద్దేశిస్తూ పరోక్షంగా అల్లు అర్జున్ పై చేసిన పోస్ట్ సంచలనగా మారిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన పోస్ట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారన్న విషయం స్పష్టంగా తెలియడంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో దెబ్బకు నాగబాబు ట్వీట్ డిలీట్ చేశారు.

ట్విట్టర్లో యాక్టివ్ అయినటువంటి నాగబాబు ట్వీట్ డిలీట్ చేశానంటూ మరొక ట్వీట్ చేయడంతో ఈ కామెంట్లపై జనసేన పార్టీ నుంచి ఇటీవల వైసిపికి వచ్చినటువంటి పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్నేక్ (బాబూ) కి పాలు పోసి పెంచిన కాటు వేయక తప్పదని కామెంట్లు చేశారు.

వాడుకొని వదిలేసేవారికి నమ్మకంగా ఉండని వారికి స్నేహం విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబం అని తెలిపారు.మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు.. నా పేరు సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న పుష్ప.

Advertisement

పార్టీకి విరాళం..
ఇక 2019 లో జనసేన పార్టీకి రూ.2 కోట్ల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు అంటూ పరోక్షంగా నాగబాబును ఉద్దేశిస్తూ చేసిన ఈ పోస్టు సంచలనంగా మారింది. ఇలా పరోక్షంగా నాగబాబు గురించి పోతున్న మహేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తిరిగి పవన్ అలాగే మెగా అభిమానులు పోతిన మహేష్ పై తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కామెంట్లు చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరి మధ్య యుద్ధం నడుస్తోందని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Peddi Reddy: లోకేష్ ఒక మూర్ఖుడు… ఆ కారణంతోనే పోలింగ్ శాతం పెరిగింది: పెద్దిరెడ్డి

Published

on

Peddi Reddy: వైఎస్ఆర్సిపి నాయకులందరూ ఎన్నికల పూర్తి కాగానే తమ ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు అలాగే మరికొందరికి దేశాలలో ఉన్నటువంటి వ్యాపారాల పనుల నిమిత్తం వెళ్తున్నారు ఈ క్రమంలోనే వైసిపి నేతలందరూ కూడా పర్యటనలకు వెళ్తున్నటువంటి తరుణంలో టిడిపి నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.

ఓటమి భయంతోనే వైసీపీ నేతలు అందరూ కూడా దేశం విడిచి వెళ్లిపోతున్నారంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఇలా దేశం విడిచి వైసిపి నేతలు వెళుతున్నటువంటి తరుణంలో లోకేష్ సైతం సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ట్వీట్స్ గురించి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము విదేశాలకు వెళుతున్నది ఓటమి భయంతో కాదని తెలిపారు. మాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు నిమిత్తమే తాము విదేశాలకు వెళ్తున్నామని తెలిపారు మేము వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలలో కొనసాగుతున్నమని పెద్దరెడ్డి తెలిపారు. లోకేష్ ఎంతో మూర్ఖుడని ఆయన సోషల్ మీడియా వేదిక ఇలాంటి పోస్ట్ లు చేయడం సరికాదని తెలిపారు.

Advertisement

మహిళా ఓట్లు..
జూన్ 4వ తేదీ ఎవరు ఓటమి భయంతో పారిపోతారనే విషయాలను తెలుసుకుందామని తెలిపారు. నాలుగో తేదీ కూటమినేతలందరూ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు చూడాలని ఈయన తెలిపారు. పోలింగ్ శాతం పెరిగింది అంటే మాకు ఓటమి వస్తుందని కాదని జగన్ అందించిన సంక్షేమ పాలన చూసి మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!