Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. బుల్లితెరపై యాంకర్లుగా చేసిన వారందరూ కూడా వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే రశ్మి సైతం పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈమెకు వెండితెరపై ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదని చెప్పాలి. ఇలా వెండితెరపై రష్మికి సరైన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి గుర్తింపు రాకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రష్మీ మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలతో కలిసి ఓపెన్ హార్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రష్మి పలువురు సెలబ్రిటీలను అడుగుతూ సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఇంద్రజ సైతం రశ్మిని ప్రశ్నిస్తూ టెలివిజన్ రంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మి వెండితెరపై ఎందుకు రాణించలేకపోతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ పలు విషయాలను వెల్లడించారు.తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని అయితే రాత్రికి రాత్రికి నా పాత్రలు మారిపోతున్నాయని తెలియజేశారు.
సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు వీళ్ళే చేయగలరు అనే స్టాంప్ ఉంది కొందరు తల్లి పాత్రలకు మాత్రమే పరిమితం మరికొందరు చెల్లెలు పాత్రలకు మాత్రమే పరిమితం మరికొందరు సెకండ్ హీరోయిన్గా మాత్రమే పరిమితం అనే స్టాంపు ఉంది. అయితే తనపై కూడా అలాంటి స్టాంప్ పడిన కారణంగా మంచి పాత్రలలో నటించే అవకాశం రాలేదని అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…