Anchor Rashmi: రహస్యంగా వివాహం చేసుకున్న యాంకర్ రష్మీ… ఎవరినంటే!
Anchor Rashmi: టాలీవుడ్ టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న వారిలో యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేదు.ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు హాజరవుతూ భారీ క్రేజ్ ఏర్పరుచుకున్నారు.
ఇదిలా ఉండగా బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోని ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
ఇలా వీరి గురించి వస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తామిద్దరం మంచి స్నేహితులం అని రష్మీ సుధీర్ వారి ప్రేమ గురించి వస్తున్న వార్తలపై ఖండించారు. ఇకపోతే తాజాగా రష్మికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యాంకర్ రష్మి ఎవరికి తెలియకుండా రహస్యంగా గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే వివాహం చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఒక ప్రైవేటు సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తిని రష్మీ పెళ్లి చేసుకుందని ప్రస్తుతం అతనితో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటుందని తెలుస్తోంది.ఇక తనకు పెళ్లి అయిన విషయం బయటపడితే తనకు అవకాశాలు తగ్గిపోయి తన కెరియర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయని అందుకే తన పెళ్లి విషయం బయట పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయంపై రష్మీ స్పందించాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…