Anchor Shyamala : బుల్లితెర పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల అటు టీవీ షో లలో బిజీగా ఉంటూ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన శ్యామల ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్ బాస్ తరువాత అటు యాంకర్ గాను ఇటు ప్రీ రిలీజ్ ఈవెంట్లతోను బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్న శ్యామల తన యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువైంది. ఇటీవలే ‘విరూపాక్ష’ సినిమాలో తన నటనతో ప్రశంసలను అందుకుంది. గతంలో తన భర్త మీద చీటింగ్ కేసు ఉదంతం గురించి శ్యామల తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
ఆ మహిళకు మా ఇంట్లో భోజనం పెట్టాను…
రెండేళ్ల క్రితం ఒక మహిళను మోసం చేసిన ఛీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తన వద్ద కోటి రూపాయిలు తీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. 2017 నుంచి 2021 వరకూ తన దగ్గర కోటి రూపాయిల వరకూ డబ్బులు వసూలు చేశాడని తనని మోసం చేశాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారం లో నర్సింహారెడ్డికి, శ్యామల గారు ఆ సమయంలో సపోర్ట్ గా నిలిచారు.
ఇక ఆ ఇష్యూ గురించి మళ్ళీ తాజాగా ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడారు. తన భర్త ఎలాంటి వాడో తనకి బాగా తెలుసనీ, ఆ మహిళ మా ఇంటికి కూడా వచ్చిందని నేనే వండి పెట్టాను, అలాంటి ఆమె మా ఆయన మీద తప్పుడు కేసు పెట్టింది. ఆ రెండు రోజులు బాగా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. నిజం తెలియడానికి సమయం పడుతుంది కానీ నిజం ఖచ్చితంగా బయటికి వస్తుంది. అదే ఈ ఇష్యూలో కూడా జరిగింది. ప్రస్తుతం ఈ కేసు క్లియర్ అయింది. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ అయింది అంటూ చెప్పారు యాంకర్ శ్యామల.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…