Categories: Political News

“కనబడుట లేదు” అంటూ పవన్ కళ్యాణ్, బాలయ్యలపై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై మరోసారి ఉద్రేకం నెలకొంది. రాజకీయ నేతల తీరు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలపై ప్రశ్నలు సంధిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Anchor Shyamala’s sensational comments on Pawan Kalyan and Balayya!

శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఓ సభలో పాల్గొన్న శ్యామల, పవన్ కళ్యాణ్ పై స్పందిస్తూ “డిప్యూటీ సీఎం గారు ప్రజలకు అందుబాటులో లేరు, కనీసం కనిపించడంలేదు” అంటూ ఆరోపించారు. ఆమె చేతిలో ఉన్న ప్లకార్డ్‌పై “పవన్ కల్యాణ్ ఎక్కడ?” అన్న ప్రశ్న వున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ హయాంలో పిఠాపురం ఎమ్మెల్యేగా తానేనన్నట్టు పోరాడిన పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చాక అసలు ప్రజల్లోకి రావడం లేదని ఆమె మండిపడ్డారు. “అందుబాటులో లేని నేతకు ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి?” అంటూ నిలదీశారు.

తదుపరి దాడి బాలకృష్ణపై. శ్యామల వ్యాఖ్యల ప్రకారం, “హిందూపురంలో అభివృద్ధి ఏమీ జరగలేదు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, ఒక డిగ్రీ కళాశాల లో క్లాసులు ప్రారంభించలేదు. పేరు మాత్రమే ఉంది” అని ఆమె ఎద్దేవా చేశారు. పోలింగ్ సమయంలో వైసీపీకి ఓ కేంద్రంలో కేవలం ఒక్క ఓటు రావడాన్ని ఉదాహరణగా చూపుతూ, “ఇది ప్రజల గెలుపా? లేక మాయా గెలుపా?” అని ప్రశ్నించారు. “బాలకృష్ణ ఒక్కోసారి మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తారు. ఎక్కువ సమయం సినిమా షూటింగ్‌లతోనే గడుపుతున్నారు” అని విమర్శించారు.

పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి ప్రముఖులపై చేసిన ఈ ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజా నేతలు ప్రజల మధ్య ఉండాలి. ప్రజల గళంగా మారాలి అన్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన శ్యామల వ్యాఖ్యలు, ఒక వైపు వైసీపీ స్టాండ్‌ను బలపరుస్తూ, మరోవైపు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఉన్నాయి.

ఇక ఈ వ్యాఖ్యలపై జనసేన, టీడీపీ ఎలా రియాక్ట్ అవుతారు అనే ఆసక్తికర అంశం. ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా శ్యామల చేసిన విమర్శలు పెద్ద చర్చకు దారితీశాయి.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago