2 women caught extorting 3l from man at jaipur cafe
జైపూర్లో రెండు మధ్య వయసు మహిళలు నిర్వహించిన సెక్స్టార్షన్ రాకెట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పరీక్, ఇందు వర్మ అనే ఇద్దరు మహిళలు తమ అందాన్ని ఆయుధంగా మార్చి ధనవంతులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తూ పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరిద్దరూ ముందుగా ధనవంతులైన వ్యక్తులను గుర్తించి, వారితో స్నేహం పెంచుతూ, ఆ తర్వాత గాఢ సంబంధాల్లోకి తీసుకెళ్లేవారు.
వారు మొదట నమ్మకాన్ని కలిగించేందుకు రొమాంటిక్గా ప్రవర్తించి, అవసరమైతే శారీరక సంబంధానికి కూడా సిద్ధమవుతారు. ఒకసారి బాధితులు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారనుకున్న తర్వాత అసలు రంగు బయటపడుతుంది. వారు రూ.50 లక్షలు డిమాండ్ చేస్తారు. చెల్లించకపోతే రేప్ కేసు పెడతామని బెదిరిస్తారు. ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి అంగీకరిస్తే, బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకుని మరీ డబ్బులు వసూలు చేస్తారు. ఒక్కసారిగా ఇవ్వలేనివారికి “EMI స్కీమ్” కూడా ఆఫర్ చేస్తారు. ఇక చెల్లించకపోతే తరచూ ఫోన్ కాల్స్, బెదిరింపులతో బాధితులను వేధించడం ప్రారంభిస్తారు. పరువు భయంతో చాలామంది నోటికి తాళం వేసుకొని లక్షల్లో డబ్బులు చెల్లించినట్లు సమాచారం.
అయితే ఓ బాధితుడి స్నేహితుడు ధైర్యం చేసి చిత్రకూట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే రూ.1 లక్ష చెల్లించిన బాధితుడిని మిగతా డబ్బుల కోసం వేధిస్తున్న సమయంలో పోలీసులు ఫేక్ ఫోన్ కాల్ ప్లాన్ చేస్తూ హోటల్లో వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీరి బాధితుల సంఖ్య ఎంత? వసూలైన మొత్తం ఎంత? అనే దానిపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన నెగెటివ్ ట్రెండ్లను, శారీరక, మానసిక బ్లాక్మెయిలింగ్ను ఏ రీతిలో వినియోగిస్తున్నారో స్పష్టంగా చూపిస్తోంది. పరిచయాలు, సంబంధాలు ఏవైనా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆకర్షణల వెనక ఏవైనా ఉద్దేశాలు దాగి ఉండొచ్చు అనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి తేల్చిచెబుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…