Roshan Kanakala: సుమ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ త్వరలోనే హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రోషన్ కి ఎన్టీఆర్ తన తండ్రి రాజీవ్ మధ్య ఉన్నటువంటి స్నేహబంధం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా ఎన్టీఆర్ రాజీవ్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని వీరిద్దరూ మాట్లాడుకోవడం కూడా మానేశారు అంటూ వార్తలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఈ విషయం గురించి రోషన్ సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తారక్ అన్న నాన్న లాంటి ఫ్రెండ్స్ చాలా అరుదుగా ఉంటారు.వీరిద్దరి ప్రయాణం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొదలైందని తెలిపారు. ఇలాంటి స్నేహితులను ఎవరు కూడా వదులుకోకూడదు అని రోషన్ తెలిపారు. నాకు ఇలాంటి స్నేహితులే ఉన్నారు. ఇక వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా రాలేదని తెలిపారు.
తారక్ చూసి డాన్స్ నేర్చుకో
వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని విడిపోయారు అంటూ వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని రోషన్ తెలిపారు. ఇక నాన్న నేను సినిమాలలోకి రావడానికి తారక్ అన్నని కూడా నాకు ఇన్స్పిరేషన్ గా చూపించారు తారక్ ని చూసి డాన్స్ నేర్చుకొంటూ తరచూ నాకు నాన్న చెప్పేవారని రోషన్ తెలిపారు. ఇండస్ట్రీలో తారక్ అన్నకు చాలా మంచి పేరు ఉందని నేను కూడా అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాను. అలాంటి స్థాయికి చేరాలన్నదే నా కోరిక అంటూ ఈ సందర్భంగా రోషన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…