Roshan Kanakala: సుమ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ త్వరలోనే హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రోషన్ కి ఎన్టీఆర్ తన తండ్రి రాజీవ్ మధ్య ఉన్నటువంటి స్నేహబంధం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా ఎన్టీఆర్ రాజీవ్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని వీరిద్దరూ మాట్లాడుకోవడం కూడా మానేశారు అంటూ వార్తలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఈ విషయం గురించి రోషన్ సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తారక్ అన్న నాన్న లాంటి ఫ్రెండ్స్ చాలా అరుదుగా ఉంటారు.వీరిద్దరి ప్రయాణం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొదలైందని తెలిపారు. ఇలాంటి స్నేహితులను ఎవరు కూడా వదులుకోకూడదు అని రోషన్ తెలిపారు. నాకు ఇలాంటి స్నేహితులే ఉన్నారు. ఇక వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా రాలేదని తెలిపారు.
తారక్ చూసి డాన్స్ నేర్చుకో
వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని విడిపోయారు అంటూ వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని రోషన్ తెలిపారు. ఇక నాన్న నేను సినిమాలలోకి రావడానికి తారక్ అన్నని కూడా నాకు ఇన్స్పిరేషన్ గా చూపించారు తారక్ ని చూసి డాన్స్ నేర్చుకొంటూ తరచూ నాకు నాన్న చెప్పేవారని రోషన్ తెలిపారు. ఇండస్ట్రీలో తారక్ అన్నకు చాలా మంచి పేరు ఉందని నేను కూడా అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాను. అలాంటి స్థాయికి చేరాలన్నదే నా కోరిక అంటూ ఈ సందర్భంగా రోషన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…