Featured

మందుబాబులకు జగన్ సర్కార్ శుభవార్త.. భారీగా తగిన ధరలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మందుబాబులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మద్యం ప్రియులకు ప్రయోజనం చేకూరేలా మద్యం ధరలను భారీగా తగ్గించింది. ప్రీమియం, మీడియంలో ప్రభుత్వం ఏకంగా 25 శాతం ధరలను తగ్గించింది. గతంలో 300 రూపాయలు ఉన్న మద్యం బాటిల్ ధరను ప్రభుత్వం దాదాపు 50 రూపాయలు తగ్గించింది. జగన్ సర్కార్ లిక్కర్, విదేశీ మద్యం ధరలను కూడా తగ్గించడం గమనార్హం.


గత నెలలో మద్యం ధరలను తగ్గించిన ప్రభుత్వం తాజాగా మద్యం ధరలను తగ్గించడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం జగన్ సర్కార్ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై నిషేధం విధించింది. అదే సమయంలో కొందరు అధికారులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు ఎక్కువగా ఉండటం వల్లే ధరలు పెంచి అమ్ముతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించింది.

రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపుల తరువాత మద్యం ధరలను భారీగా పెంచిన జగన్ సర్కార్ వాటిని అంచెలంచెలుగా తగ్గిస్తూ వస్తోంది. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం రాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తీసుకొస్తే వారిపై చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంపై మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో భారీగా మద్యం ధరలు పెరగడంతో కొందరు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొందరు అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం తీసుకొస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago