ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 174 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దానికి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ 2021 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కాగా.. చివరి తేదీగా సెప్టెంబర్ 30, 2021 గా నిర్ణయించారు.
అంటే దరఖాస్తుకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://hc.ap.nic.in/ వెబ్సైట్ చూసి.. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా దరఖాస్తులను నిపాలని సూచించారు. అందులో ముఖ్యంగా 71 అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 29 పోస్టులు ఎగ్జామినర్, 35 పోస్టులు టైపిస్టు, 39 పోస్టులు కాపీయిస్ట్ ఉన్నట్లు తెలిపారు.
దీనికి అర్హతగా ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు టైప్రైటింగ్ (ఇంగ్లీష్) హయ్యర్ గ్రేడ్లో ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామ్ పాస్ కావాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. 18 నుంచి 42 ఏళ్ల మద్య వయస్సుగల అభ్యర్థలు దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష ఆధారంగా ఎంపికచేయనున్నారు. దీనికి వేతనంగా
జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయని.. ఆసక్తి గల అభ్యర్థలు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు https://hc.ap.nic.in/ ను సందర్శించి అందులో నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకొని దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ మోడ్ లో మాత్రమే పంపాలని పేర్కొన్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…