Featured

జగన్ మరో సంచలన నిర్ణయం… సగానికి పైగా మహిళలకే..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పారు. ఏపీ చరిత్రలోనే సీఎం తొలిసారి 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు కానుండగా వాటిలో సగానికి పైగా జగన్ సర్కార్ మహిళలకే కేటాయించడం గమనార్హం. ప్రభుత్వం రాష్ట్రంలో 30,000కు పైగా జనాభా ఉన్న ప్రతి కులానికి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

 వెనుకబడ్డ తరగతులకు చెందిన ప్రజలకు ప్రయోజనం చేకూర్చటంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. రేపు రాష్ట్రంలో భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 56 కులాలలో 29 కార్పొరేషన్లను మహిళలకు కేటాయించగా 27 కార్పొరేషన్లను పురుషులకు కేటాయించారు. సగానికి పైగా సీట్లు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం గురించి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కార్పొరేషన్ల విషయంలో ప్రాతినిథ్యం కలిగే విధంగా చర్యలు చేపట్టింది.
 
అనంతపురం జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు, విజయనగరం జిల్లాలో నలుగురికి పదవులు దక్కనున్నాయి.
 
అన్ని జిల్లాలకు దాదాపుగా సమ ప్రాధాన్యం ఇచ్చి సీఎం జగన్ ఏ జిల్లా ప్రజలు నష్టపోకుండా చేశారు. ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పాలన సాగిస్తున్న జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago