కన్నడ చిత్రపరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ మరియు టాలీవుడ్ తారలను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారం తాజాగా శాండిల్ వుడ్ లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర నేర నియంత్రణ విభాగం ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు నటి సంజనా గల్రానీని కూడా అరెస్టు చేసి సంజన ఇంట్లో ల్యాప్ టాప్, హర్డ్ డిస్క్, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీరిద్దరూ అరెస్ట్ అయినా తర్వాత జరిపిన విచారణలో భాగంగా వీళ్లిద్దరి మొబైల్ ఫోన్లను పరిశీలించగా, వాటిల్లో నీలి చిత్రాల వీడియోలు ఉన్నట్టు, దాంతో ఈ హీరోయిన్లకు సెక్స్ రాకెట్ కూడా సంబంధాలున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజాగా ఈ హీరోయిన్లిద్దరూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ స్మార్ట్ ఫోన్లను సీజ్ చేసిన అధికారులు, వాటిల్లో అత్యంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఈ ఫోన్లలో బ్లూ ఫిల్మ్లతో పాటు, మరికొందరు హీరోయిన్ల చిత్రాలు, వీడియోలు కనిపించడంతో దీంతో డ్రగ్స్ కేసు వెనుక మరో దందా కూడా నడుస్తోందని అధికారులు విశ్వసిస్తున్నారు.
ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా వీరు దందాను నడిపించారని, డ్రగ్స్ కేసు బయటకు రాగానే ఆ గ్రూప్ను వీళ్ళు డిలీట్ చేశారని చెబుతున్న సీసీబీ, ఈ విషయంలోనూ లోతుగా విచారించాల్సి వుందన్నారు. ఈ సందర్భంగా దీంతో సంబంధముందని భావిస్తున్న అందరికీ నోటీసులు పంపించి విచారించాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేసారు. అయితే లేటెస్ట్ గా ఈ కేసులో మరో ఇద్దరిని బెంగళూరులో సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కెంగేరికి చెందిన ఓ వ్యక్తిని, నైజీరియా వాసిని అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించామని స్పష్టం చేశారు. వీరిద్దరూ ముంబై, గోవా తదితర ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాలను తీసుకుని వచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు తేలిందని, తమ అదుపులో ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా వీళ్ళను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా గత 3 రోజుల నుంచి పలువురిని విచారించామని, వీరికి సన్నిహితంగా ఉన్నవారిని కూడా విచారిస్తున్నామని అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు. అంతేకాకుండా, రాగిణి క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరినీ చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలో విచారించామని, వారు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసిందని, ఈ వ్యవహారంలో ఈమధ్యనే సస్పెండ్ అయిన ఓ ఏసీపీకి కూడా ప్రమేయం ఉన్నట్టు తెలిసిందని అన్నారు. ఇదిలా ఉండగా శాండిల్ వుడ్ లోని డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంజన “బుజ్జిగాడు” చిత్రంలో త్రిష చెల్లెలుగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత తరుణ్ నటించిన సోగ్గాడు చిత్రంలో నటించిన సంజన యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో కూడా నటించింది. మరి ఈ డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యేలోపు ఇంకెన్ని భాగోతాలు బయట పడతాయోనన్న భయంతో సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ మౌనంగా ఉండిపోయారు.
ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం సరిపోదు. ఆహారం తీసుకున్న తర్వాత పాటించే అలవాట్లు కూడా శరీరంపై పెద్ద…
వేసవి కాలం అనగానే మనకు గుర్తొచ్చేది పగటి వేడి, మండుటెండలే. అయితే ఇటీవల పరిస్థితి మారుతోంది. సూర్యుడు అస్తమించిన తర్వాత…
పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అరుదుగా కనిపించినా, పూర్తిగా విస్మరించలేని ఆరోగ్య సమస్యగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా కాలంగా ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన మురళీ మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్…
బెంగళూరులో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బెంగళూరులోని ఆడుగోడి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న…
టాలీవుడ్లో తనదైన శైలితో కమెడియన్గా, రచయితగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఎల్.బి. శ్రీరామ్ తాజాగా తన కెరీర్ ప్రారంభ దశలో…