Pitapuram: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. గత ఎన్నికలలో ఈయన భీమవరం గాజువాక నియోజకవర్గాలలో పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ కాపులు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈయన ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కోసం మద్దతు తెలుపుతూ ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా పిఠాపురం చేరుకున్నారు.
ఇప్పటికే జబర్దస్త్ టీం మొత్తం పిఠాపురంలో పర్యటించి పవన్ కళ్యాణ్ గెలుపుకు దోహదపడుతున్నారు. అదేవిధంగా మరోవైపు నాగబాబు కుటుంబ సభ్యులు మొత్తం పిఠాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. వీరు మాత్రమే కాకుండా సీరియల్ ఆర్టిస్టులు కూడా పిఠాపురంలో పర్యటించారు.
పిఠాపురంలో వైష్ణవ్ తేజ్
ఇలా ఇప్పటికే భారీ మొత్తంలో సెలబ్రిటీలు పిఠాపురంలో పర్యటనలు చేశారు. అయితే తాజాగా మరొక మెగా హీరో కూడా పిఠాపురంలో పర్యటన చేయడం గమనార్హం. మెగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నటుడు వైష్ణవ్ తేజ్ జనసేన పార్టీ తరపున పిఠాపురంలో పర్యటించారు. తన మామయ్య పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలంటూ ఈయన కోరారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…