Puneeth Rajkumar: పునీత్ ఇంట మరో విషాదం.. శోకసంద్రంలో పునీత్ కుటుంబ సభ్యులు!
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటు రావడంతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరణ వార్త నుంచి ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మంది అభిమానులు బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పునీత్ ఇంట మరో విషాద ఘటన చోటుచేసుకుంది.
పునీత్ రాజ్ కుమార్ మరణించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ప్రతిక్షణం ఆయనను తలుచుకుంటూ పునీత్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ ఫిబ్రవరి 20వ తేదీ గుండెపోటుతో మరణించారు.
పునీత్ మరణవార్త ఆయనను తీవ్రమైన ఒత్తిడికి గురి చేసిందని ఆయన మరణ వార్తను అనుక్షణం తలుచుకొని ఎంతో భావోద్వేగానికి గురి అయ్యే వారని ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని M.S రామయ్య ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా భర్త చనిపోయి ఐదు నెలల వ్యవధిలోనే తండ్రి కూడా మరణించడంతో అశ్విని తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే పునీత్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక నేడు మధ్యాహ్నం రేవనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇలా భర్త మరణించిన వెంటనే తన తండ్రి కూడా మరణించడంతో కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…