తమిళంలో విడుదలైన పదహారేళ్ళ వయసు మాతృకలో శ్రీదేవి నటించారు. దర్శకుడు రాఘవేంద్ర రావు ఆ సినిమా చూసిన తర్వాత అదే చిత్రాన్ని తెలుగులో రూపొందించాలనుకున్నారు. తెలుగులో కూడా శ్రీదేవినే హీరోయిన్ గా తీసుకున్నారు. “పదహారేళ్ళవయసు” చిత్రం తరువాత శ్రీదేవికి హీరోయిన్ గా అద్భుతమైన కమర్షియల్ బ్రేక్ వచ్చింది. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి హీరోయిన్ అనగానే ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ జయసుధ, జయప్రదలను పక్కనపెట్టి “వేటగాడు” చిత్రానికి ఎన్టీఆర్ తో జోడిగా శ్రీదేవిని తీసుకున్నారు. “వేటగాడు” చిత్రంతో ప్రారంభమైన ఈ కాంబినేషన్ అనేక విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు.
1982లో బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి, అనురాగ దేవత ఈ మూడు చిత్రాల్లో ఒకే జోడీగా ఎన్టీఆర్, శ్రీదేవి ఇరగదీశారు. అదే సంవత్సరంలో వచ్చిన “నాదేశం” చిత్రంలో ఎన్టీఆర్ జయసుధ కలిసి నటించారు. “అనురాగ దేవత” 1982లో విడుదలైన తెలుగు చిత్రం. జీతేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామెశ్వరి నటించిన హిందీ చిత్రం ‘ఆశా’ ఆధారంగా ఎన్.టి.ఆర్ సొంతంగా నిర్మించిన ఈ సినిమాకు పరుచూరి సోదరులు రచన చేశారు.
ఎన్.టి.ఆర్ లారీ ద్రైవర్. శ్రీదేవి పేరున్న గాయకురాలు. వారిరువురికి పరిచయం కలుగుతుంది. శ్రీదేవి అతన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆ డ్రైవర్ కు అప్పటికే పెళ్లైపోయి ఉంటుంది (జయసుధ తో). ఒక ప్రమాదం వల్ల వారిరువురూ విడిపోతారు. జయసుధను ప్రమాదం నుండి బాలకృష్ణ కాపాడుతాడు. డ్రైవరు పట్ల ఆశ పెంచు కున్న శ్రీదేవి చివరలో రామారావు, జయసుధ కలవడంతో వంటరిగా మిగిలిపోతుంది.
1982 లో విడుదలైన తెలుగు చిత్రాల్లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “బొబ్బిలి పులి” చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన నటించిన “జస్టిస్ చౌదరి” “నా దేశం” ఆ తర్వాత వచ్చిన “అనురాగ దేవత” విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న బాలకృష్ణకు ఈ సినిమా ఎంతగానో దోహద పడిందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…