టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన. అనుష్కకు మరొక పేరు స్వీటి అనే సంగతి మనకు తెలిసిందే. పేరుకు తగ్గట్టుగానే ఆమె ప్రవర్తన మాటతీరు ఇతర పట్ల చూపే ప్రేమానురాగాలు కూడా ఎంతో స్వీట్ గా ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ విపత్కర పరిస్థితులను గురించి తాజాగా అనుష్క ప్రజలందరిలో ధైర్యం నింపేలా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో ఎంతో మందికి సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలలో ఉన్న భయాన్ని తొలగించి వారికి ధైర్యం నింపడానికి జేజమ్మ తనదైన శైలిలో పోస్టు ద్వారా అందరికీ ధైర్యం నింపారు.
ఈ సందర్భంగా అనుష్క తెలియజేస్తూ… ఇప్పుడున్న ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మంచిగా ఉన్నారనే భావిస్తున్న.. పోయిన వారిని ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము, ఇలాంటి ఈ పరిస్థితులలో నుంచి బయటకు రావడానికి మనకు మనమే సహాయం చేసుకుంటూ పోవాలి.ప్రభుత్వం తెలియజేసిన నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనకు మనమే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. మీ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ సంతోషంగా గడపండి. ఈ క్రమంలోనే శ్వాసకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయండి.
ప్రతిరోజు ఉదయం ఒక పాజిటివీటితో మొదలు పెట్టండి
జీవితంలో మనకు ఆ పాజిటివ్ ఎనర్జీయే అవసరం. మనకు చేతనైనంత సాయం చేయండి.. అది ప్రార్థనలు అయినా పర్లేదు.. మనం కష్ట కాలాన్ని ఎదుర్కొంటాం. ఎప్పుడు నెగిటివిటీ గురించి ఆలోచిస్తూ మనకున్న శక్తిని వృధా చేసుకోకూడదు అంటూ అనుష్క ఎంతో మంది లో ధైర్యం నింపింది. జేజమ్మ స్వీట్ గా చెప్పిన ధైర్యానికి ఎంతోమంది అభిమానులు ఫిదా అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…