Anushka's 'Ghati' trailer is out.
‘బాహుబలి’ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో స్టార్డమ్ సొంతం చేసుకున్న నటి అనుష్క శెట్టి, ఆ తర్వాత కొంతకాలం సినీ రంగంలో సైలెంట్గా ఉండిపోయింది. చాలా గ్యాప్ తర్వాత, ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ను అందుకుంది. ఇప్పుడు అనుష్క, మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘ఘాటి’ పేరుతో తెరకెక్కిన ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ, ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమాలో, అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విక్రమ్ ప్రభు మరియు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా, మొదట నుంచే పెద్ద హైప్ను క్రియేట్ చేసింది. అయితే పలు కారణాల వల్ల ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్లో ఊహించినదానికంటే ఎక్కువ యాక్షన్ మరియు వయోలెన్స్ కనిపించాయి. ముఖ్యంగా అనుష్క తన గూస్బంప్స్ యాక్టింగ్తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో స్టోరీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ కలగలిపి అద్భుతమైన అనుభూతిని ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. చాలా కాలంగా అనుష్క సినిమాల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ‘ఘాటి’ సినిమా ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ను అందించబోతోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…