Anushka's 'Ghati' trailer is out.
‘బాహుబలి’ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో స్టార్డమ్ సొంతం చేసుకున్న నటి అనుష్క శెట్టి, ఆ తర్వాత కొంతకాలం సినీ రంగంలో సైలెంట్గా ఉండిపోయింది. చాలా గ్యాప్ తర్వాత, ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ను అందుకుంది. ఇప్పుడు అనుష్క, మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘ఘాటి’ పేరుతో తెరకెక్కిన ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ, ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమాలో, అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విక్రమ్ ప్రభు మరియు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా, మొదట నుంచే పెద్ద హైప్ను క్రియేట్ చేసింది. అయితే పలు కారణాల వల్ల ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్లో ఊహించినదానికంటే ఎక్కువ యాక్షన్ మరియు వయోలెన్స్ కనిపించాయి. ముఖ్యంగా అనుష్క తన గూస్బంప్స్ యాక్టింగ్తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో స్టోరీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ కలగలిపి అద్భుతమైన అనుభూతిని ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. చాలా కాలంగా అనుష్క సినిమాల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ‘ఘాటి’ సినిమా ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ను అందించబోతోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…