ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా,చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలోనూ వివిధ పరీక్షలను వాయిదా వేశారు.కానీ ఏపీలో మాత్రం యధావిధిగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని చెప్పిన ఏపీ ప్రభుత్వం చివరికి ఇంటర్ చదివే విద్యార్థుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా పరిస్థితులు కొద్దిగా సద్దుమణిగిన తరువాత తిరిగి పరీక్షలను నిర్వహిస్తామని, త్వరలోనే పరీక్ష తేదీలను వెల్లడిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి 22 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అదేవిధంగా మే 6 నుంచి 23 వరకు రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
ఈ క్రమంలోనే కరోనా కేసులు అధికమవుతున్న సమయంలో పరీక్షలు నిర్వహించవద్దని పలు పార్టీలు ప్రభుత్వాన్ని కోరడంతో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొందరు పరీక్షల నిర్వహణ పై కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. తొందరలోనే పరీక్ష నిర్వహణ తేదీలను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…