ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మందుబాబులకు భారీ షాక్ ఇచ్చింది. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తెచ్చుకోవడానికి అనుమతులపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా మద్యం తెచ్చుకోవాలంటే పర్మిట్ తప్పనిసరిగా ఉండాలని.. పర్మిట్లు లేకుండా మద్యం తెచ్చుకునేవాళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఎక్సైజ్ శాఖ నుంచి ఈ మేరకు కొత్తగా జీవో నెంబర్ 310 విడుదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి భారీగా మద్యం వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనే సదుద్దేశంతో సంవత్సరం సంవత్సారనికి మద్యం దుకాణాల సంఖ్య భారీగా తగ్గిస్తుంటే మందుబాబులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకుంటూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు.
గతంలో రాష్ట్రంలోని ప్రజలకు ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవడానికి అనుమతి ఉండేది. అయితే కొత్త జీవో ప్రకారం మందుబాబులు మందుబాటిళ్లను తెచ్చుకోలేరు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యంపై పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలయ్యే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసింది. అయితే కేంద్ర నిబంధనల ప్రకారం విదేశాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చు.
మద్యం ప్రియులు నిబంధనలు అతిక్రమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. పర్మిట్లు లేకుండా మద్యం తెచ్చుకునే వాళ్లపై 1968 ఎక్సైజ్ చట్టం కింద ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మద్యం అక్రమ రవాణా వల్ల ప్రభుత్వానికి రోజురోజుకు ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసి కొత్త జీవో విడుదల చేసింది.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…