ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కులాల ప్రజలకు శుభవార్త చెప్పారు. జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం పేరుతో కొత్త స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేయనున్నారు. సీఎం జగన్ నేడు 2020 – 23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఈ కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చామని వెల్లడించారు.
రాష్ట్రంలోని ఎస్సీలకు 16,2 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున భూములను కెటాయిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అధికారులు ఈ రెండు కులాలకు చెందిన వాళ్లలో ఎవరికైనా పరిశ్రమలు పెట్టుకోవాలనే ఆసక్తి ఉంటే ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియజేయాలని పేర్కొన్నారు. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించారు.
దసరా పండుగ నేపథ్యంలో ఈ కొత్త స్కీమ్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. దసరా పండుగ సమయంలో ఈ స్కీంను అమలు చేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు కోటి రూపాయల ప్రోత్సాహకాలను ప్రకటించబోతున్నామని వెల్లడించారు.
పేటెంట్ రుసుముల్లో రాయితీలు, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీలు కల్పించబోతునామని సీఎంతెలిపారు. పేదల జీవితాలను మార్చాలనే ఉద్దేశంతో నవరత్నాల హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…