ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కులాల ప్రజలకు శుభవార్త చెప్పారు. జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం పేరుతో కొత్త స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేయనున్నారు. సీఎం జగన్ నేడు 2020 – 23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఈ కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చామని వెల్లడించారు.
రాష్ట్రంలోని ఎస్సీలకు 16,2 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున భూములను కెటాయిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అధికారులు ఈ రెండు కులాలకు చెందిన వాళ్లలో ఎవరికైనా పరిశ్రమలు పెట్టుకోవాలనే ఆసక్తి ఉంటే ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియజేయాలని పేర్కొన్నారు. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించారు.
దసరా పండుగ నేపథ్యంలో ఈ కొత్త స్కీమ్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. దసరా పండుగ సమయంలో ఈ స్కీంను అమలు చేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు కోటి రూపాయల ప్రోత్సాహకాలను ప్రకటించబోతున్నామని వెల్లడించారు.
పేటెంట్ రుసుముల్లో రాయితీలు, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీలు కల్పించబోతునామని సీఎంతెలిపారు. పేదల జీవితాలను మార్చాలనే ఉద్దేశంతో నవరత్నాల హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…