ప్రస్తుతం కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. తాజాగా థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపధ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు కూడా వ్యాక్సిన్ వేసే ప్రక్రియను మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇదేల్లలోపు చిన్నారుల తల్లులు రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో గుర్తించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ప్రజారోగ్య సంచాలకులు డా.గీతాప్రసాదిని ఆదేశించారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లపై ప్రభావం ఉంటుందన్న నేపధ్యంలో భవిష్యత్లో ఒక వేళ పిల్లలకు కరోనా సోకినా అది తల్లులకు సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వారికీ వ్యాక్సిన్ వేయాలని ఇటీవలె సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇందులో భాగంగా ఎపీలోని గ్రామాలన్నిటిలోనూ ఐదేళ్ళ లోపు చిన్నరులున్న తల్లులను గుర్తించేందుకు ఆదేశాలిచ్చారు. వ్యాక్సిన్ వేయడానికి ఒకరోజు ముందుగానే టోకెన్లు ఇచ్చి ఆతరువాత వీరిని వ్యాక్సిన్ సెంటర్కు తీసుకువచ్చే బాధ్యతను ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు అప్పజెప్పారు. కాగా, వ్యాక్సిన్ అవసరమైన తల్లులు 15 లక్షల మందికి పైగానే ఉంటారని అంచనా. వయస్సుతో నిమిత్తం లేకుండా వీరికీ వ్యాక్సిన్ వేస్తారు. ఈ విధానం తలపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…