Featured

ఒకప్పటి సినీ నటుడు అచ్యుత్ గుర్తున్నాడా.? తన పిల్లలు చిన్న వయసులోనే పాపం గుండెపోటుతో మరణించాడు.!!


“అంతరంగాలు అనంత మానస చదరంగాలు.. అంతే ఎరగని ఆలోచనల సాగరాలు.. “1990 చివరి దశకంలో బుల్లితెరలో దారా వాహికంగా వచ్చిన అంతరంగాలు సీరియల్ లోని ఈ పాట తెలుగు ప్రజలను ఒక ఊపు ఊపేసింది. ఈ పాట గుర్తుంటే అంతరంగాలు సీరియల్ లో నటించిన అచ్యుత్ కూడా మనకు గుర్తుంటాడు. ఈటీవీలో హిట్టయిన సీరియల్స్ లో అంతరంగాలు దారావహికం ఒకటి. ఇందులో అతని నటన మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలాంటి సీరియల్స్ మళ్లీ రావాలని మహిళా అభిమానులు కోరుకునే లోపే నటుడు అచ్యుత్ పరమపదించడం మహిళా ప్రేక్షకులకు తీవ్ర ఆవేదన కలిగించింది.

1964 లో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రామారావు సుజాత దంపతులకు అచ్యుత్ జన్మించారు. డిగ్రీ చదువుతున్న క్రమంలోనే అచ్యుత్ నాటకరంగంపై ఎక్కువ ఇష్టాన్ని చూపేవాడు. 1980 ప్రారంభదశలో అచ్యుత్ హైదరాబాద్ వచ్చి అక్కడ మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండు సంవత్సరాలు నటనలో శిక్షణ తీసుకున్నాడు. అలా 1986లో దూరదర్శన్ లో ప్రసారమైన ఇంద్రధనస్సు సీరియల్ లో మొదటగా నటించాడు. ఆ తర్వాత వెన్నెల వేట, ప్రేమంటే ఇదే 1988లో మిస్టర్ బ్రహ్మానందం లాంటి సీరియల్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బేబీ దర్శకత్వంలో వచ్చిన ఆదివారం అమావాస్య హారర్ మూవీ తో అచ్యుత్ వెండితెరపై కనిపించాడు.

ఈ సినిమాలో అచ్యుత్,జయ రేఖ హీరో,హీరోయిన్లుగా నటించారు. సోమయాజులు ప్రధాన పాత్ర పోషించారు. 1991లో జంధ్యాల దర్శకత్వంలో ప్రేమ ఎంత మధురం, ఆ తర్వాత సుమన్ హీరోగా నటించిన పట్టుదల చిత్రంలో అచ్యుత్ నటించారు. రాజశేఖర్, సుకన్య హీరోహీరోయిన్లుగా నటించిన ‘అమ్మ కొడుకు’ చిత్రంలో అచ్యుత్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు చిత్రంలో ఆయనకు అన్నగా నటించాడు. చిరంజీవి సినిమాలు చూసి చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన అచ్యుత్ కు ఆయనతో నటించలేదని అనుకుంటున్న సమయంలో 2001 సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డాడీ అనే చిత్రంలో అచ్యుత్ ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. చిరంజీవి అభిమానిగా ఆయనతో నటించడం అచ్యుత్ కి ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. కానీ అదే సమయంలో సినీ ప్రముఖులు కొంతమంది బిజినెస్ చేసి లాభాలు పొందడం చూసి తాను కూడా ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నారు.

ఆ క్రమంలో దాదాపు 40 లక్షల రూపాయలు అప్పు చేసి వినయ్ ప్రింటింగ్ ప్రెస్ ని తన స్నేహితులతో ప్రారంభించాడు. ఆయన సినిమాల్లో బిజీగా ఉండడంతో స్నేహితులకు వ్యాపారం అప్పగించడం వలన అందులో చాలా నష్టాలు వచ్చాయి. ఆయన చేసిన అప్పు గురించి ఆలోచిస్తు.. ఒకరోజు అత్యంత చల్లని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో… చాతిలో నొప్పి రావడంతో అది గుండెపోటు అని గ్రహించే లోపే అచ్యుత్ మరణించాడు. వెండితెర, బుల్లితెర సినీ ప్రముఖులు,అభిమానులు ఆయన మరణానికి కన్నీటి పర్యంతమయ్యారు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందం సీరియల్ లో నటించినందుకు ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. 1990 లో ఆయన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును ఇచ్చింది. ఆయనకు సుజాత, శివాని అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వెండితెర కంటే బుల్లితెర పైనే అశేష అభిమానులను అచ్యుత్ సంపాదించుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

టికెట్ పెంపుపై దుమారం… చివరకు తగ్గిన దేవస్థానం!

శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…

3 hours ago

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…

4 hours ago

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

14 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

14 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

14 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

14 hours ago