వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ళ కుమారుడిని కిరాతకంగా హతమార్చింది ఒక తల్లి. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్నప్రేమను మరచిపోయిన ఆ తల్లి తన వివాహేతర సంబంధానికి తన మూడేళ్ల కొడుకు అడ్డుగా ఉన్నాడని విచక్షణారహితంగా కొట్టి హతమార్చింది.
మేడ్చల్ జిల్లా, సూరారం పరిధిలో ఈ ఘటన జరిగింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ మహిళ గత రెండేళ్లుగా తన భర్తకు నుండి దూరంగా ఉంటుంది. అయితే అదే సమయంలో మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తుంది. అయితే ఈరోజు ఉదయం విక్షణ కోల్పోయిన ఆ మహిళ ఆమె కుమారుడు ఉమేశ్ (3) ను తీవ్రంగా కొట్టడంతో ఆ చిన్నారి ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరాడు. అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినాట్టు నిర్ధారించారు వైద్యులు. అయితే వారిద్దరి మధ్యలో కుమారుడు అడ్డున్నాడనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…