ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ డింపుల్ కపాడియా. ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ఎక్కువగా హిందీ భాషలో నటించింది. అంతేకాకుండా తమిళ, మలయాళ భాషలో కూడా నటించింది. తన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. 1973లో బాబి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డింపుల్ తొలి నటనకే మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించింది.
2015 వెల్ కమ్ బ్యాక్ సినిమాలో చివరి సారిగా నటించగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈమె 1973లోనే సినీ నటుడు రాజేష్ ఖన్నా ను పెళ్లి చేసుకుంది. వీరికి ట్వింకిల్, రింకీ అనే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈమె రాజేష్ కన్నా తో 1982లో విడిపోయింది. తన కూతురును కూడా నటులుగా చేసింది. ఇక తన పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తన భర్తతో విడిపోయిన తర్వాత కూడా విడాకులు ఇవ్వలేదట.
తన భర్త తో విడిపోయిన తర్వాత తనకు కష్టకాలంలో సన్నీ డియోల్ అండగా నిలబడ్డాడు. ఇక వీరి మధ్య సన్నిహితం బాగా వైరల్ గా మారింది. ఇక దర్శక నిర్మాతలు కూడా వీరి మధ్య ఎఫైర్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ జంటను ఎంచుకునేవారట. డింపుల్ తో సన్నిహితంగా ఉంటున్నందుకు సన్నీ డియోల్ భార్య అప్పట్లో గొడవ కూడా చేసిందట. ఇక ఆ సమయంలో డింపుల్ ఆమెకు విడాకులు ఇవ్వమని సన్నీని కోరిందట. కానీ అతను విడాకులకు ఇష్టపడకపోవడం తో డింపుల్ కూడా తన భర్తకు విడాకులు ఇవ్వద్దని నిర్ణయం తీసుకుందట.
నిజానికి డింపుల్, రాజేష్ కన్నా మధ్య ఎటువంటి భేదాలు లేవట. ఏ రోజు కూడా ఒకరి ఇష్టాలకు మరొకరు అడ్డు చెప్పలేదట. ఇక వీళ్ళు బయట కలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ లా మాట్లాడుకుంటారట. తన భర్త ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సమయంలో కూడా తన వంతు ప్రచారం చేసిందట డింపుల్. ఇక ఆయన ఈ ఏడాది అనారోగ్యానికి గురైనప్పుడు కూడా తన వద్దే ఉండి బాధ్యతలు తీసుకుందట డింపుల్.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…