AP liquor scam accused Venkatesh Naidu is a TDP man? Sensational photos come to light!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో A-34 నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు, టీడీపీలోని పలువురు అగ్ర నాయకులతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ కేసు మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారితో సన్నిహితంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు వివిధ సందర్భాల్లో తీసినవిగా తెలుస్తోంది.
గతంలో వెంకటేష్ నాయుడు భారీగా డబ్బులు లెక్కపెడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో ఈ కేసుపై ఉత్కంఠ పెరిగింది. ఇప్పుడు ఈ రాజకీయ నేతలతో ఉన్న ఫొటోలు బయటకు రావడంతో రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. నెటిజన్లు “తీగ లాగితే డొంక కదులుతోంది,” “ఇప్పుడే మొదలైంది అసలు గేమ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పరిణామం లిక్కర్ స్కామ్ దర్యాప్తును ఏ మలుపు తిప్పుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…