AP liquor scam accused Venkatesh Naidu is a TDP man? Sensational photos come to light!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో A-34 నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు, టీడీపీలోని పలువురు అగ్ర నాయకులతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ కేసు మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారితో సన్నిహితంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు వివిధ సందర్భాల్లో తీసినవిగా తెలుస్తోంది.
గతంలో వెంకటేష్ నాయుడు భారీగా డబ్బులు లెక్కపెడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో ఈ కేసుపై ఉత్కంఠ పెరిగింది. ఇప్పుడు ఈ రాజకీయ నేతలతో ఉన్న ఫొటోలు బయటకు రావడంతో రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. నెటిజన్లు “తీగ లాగితే డొంక కదులుతోంది,” “ఇప్పుడే మొదలైంది అసలు గేమ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పరిణామం లిక్కర్ స్కామ్ దర్యాప్తును ఏ మలుపు తిప్పుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…