General News

సీఎం జగన్ కు నిమ్మగడ్డ ఝలక్.. వాళ్లతో చర్చలు పూర్తయ్యాయట…?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో కీలక మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ లేకపోతే రాష్ట్రంలో మార్చి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. అయితే ఊహించని విధంగా కరోనా విజృంభణ వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సుముఖంగానే ఉన్నా జగన్ సర్కార్ కు మాత్రం రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేదు.

సాధారణంగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా ఏపీలో ఎన్నికల కమిషన్, వైసీపీ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. జగన్ సర్కార్ ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరగకుండా ఈసీ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోందని కామెంట్లు చేసింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం వైసీపీ ఆరోపణలను ఖండిస్తున్నారు.

ఈరోజు ఎన్నికల నిర్వహణ గురించి అన్ని పార్టీల అభిప్రాయలను తీసుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. 11 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయని.. ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌తో ఏపీలో కరోనా పరిస్థితులపై చర్చించామని అన్నారు. ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణ గురించి అభిప్రాయాలను తెలిపారని చెప్పారు.

రాజకీయపక్షాల గుర్తింపు, సంప్రదింపుల ప్రక్రియలో సీఈసీ విధానాన్నే అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించలేదని ఆరోపణలు చేయగా నిమ్మగడ్డ వారిని కూడా సంప్రదించినట్టు తెలపడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

15 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

15 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

1 day ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

1 day ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

1 day ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

1 day ago