Political News

Pawan Kalyan : ‘రప్పా రప్పా’ అంటే భయపడతామా? వైసీపీపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. “మాట్లాడితే రప్పా రప్పా అంటున్నారు. వాళ్ల తాకాటుకు తాము భయపడేది లేదని, బెదిరింపులకు తలొగ్గేది కాదని స్పష్టం చేశారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా?” అంటూ సూటిగా ఎదురు ప్రశ్నించారు. తాము ఎంతో కృషి చేసి, ఉద్యమాల ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పొందామని గుర్తు చేశారు. అలాంటి వారిని బెదిరిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. గత పాలకులు ఎలా ప్రజల తిరస్కారానికి గురయ్యారో ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు.

మద్యం పాలసీపై ఆగ్రహం: “ప్రజల ప్రాణాలు తీశారు”

మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, వైసీపీ పాలనలో మద్యం పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “2019 ఎన్నికల ముందు మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా విస్మరించి, ధరలు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేశారు” అని విమర్శించారు. నాసిరకం మద్యం వల్ల పలువురు మృతి చెందారని ఆరోపించారు. “డబ్బు పోతే ఓకే.. కానీ ప్రజల ప్రాణాలు తీసే విధంగా వ్యవహరించారా?” అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

లిక్కర్ స్కాం, కేసుల విచారణపై స్పష్టత

లిక్కర్ స్కామ్‌లో పలువురు అరెస్టై ఉండటం గురించి కూడా పవన్ స్పందించారు. తప్పు చేశారనే గానీ వారిని అరెస్ట్ చేశారని, ఇది ఒక్కటే వైసీపీ పాలన అసలైన దారుణాన్ని బయటపెడుతోందని అన్నారు. పైగా తప్పు చేసి ప్రజలను ఎదిరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “ఈ పేపర్ పులులు, తాటాకు చప్పుళ్లకు కూటమి భయపడదు. తాము న్యాయ బద్ధంగా కేసుల విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని” పవన్ స్పష్టం చేశారు.

telugudesk

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

12 hours ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

13 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

13 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

13 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

14 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

14 hours ago