కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా(కేఎస్ఆర్టీసీ) సంస్థకు కర్ణాటక హైకోర్టు కీలక ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు షాక్ అయ్యారు. ఇంతకు ఆ ఉత్తర్వులో ఏముందంటే.. ఎవరికైనా ఒంటరిగా లేదా బోరింగ్ గా అనిపించినప్పడు మొబైల్ దగ్గరే ఉంటుంది కాబట్టి పాటలు వింటుంటాం.
అందులో కొందరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే.. మరికొందరు స్పీకర్ పెట్టి బయటకు వినిపించే విధంగా ప్లే చేస్తారు. దీని వల్ల పక్కన ఉన్న వ్యక్తులు ఎక్కువగా అసహనానికి గురవుతారు. ఆ సమయంలో ఆ విధంగా వ్యవహరిస్తున్న మనిషిని చూస్తే విపరీతమైన కోపం వస్తుంది.. కానీ అతడిని మనం ఏం అనలేని పరిస్థితి.
కానీ ఇక నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి పనులు చేస్తే.. నిర్దాక్షణ్యంగా కండక్టర్ అతడిని దించే అధికారాన్ని ఇచ్చింది హైకోర్టు. దీని వల్ల బస్సులో ఉండే వాతావరణం చెడిపోవడమే కాకుండా.. మరో వ్యక్తి తీవ్ర ఇబ్బందులకు గురవుతాడు. అందుకే హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
అంతకముందే దీనిపై రిట్ పిటిషన్ కోర్టులో దాఖలు అయింది. ఇవాళ దీనిపై కోర్టు తీర్పును వెలువరించింది. ఇక నుంచి సహ ప్రయాణికుడిని ఇబ్బంది కలిగించేలా అధిక సౌండ్లు పెట్టి పాటలు ప్లే చేస్తే.. ఇక అతడిని అక్కడే దించేస్తారు. ఈ సూచనలు ప్రతీ ఒక్కరూ పాటించాలని హైకోర్టు తెలిపింది. ఇవి పాటించకపోతే చర్యలు మరోలా ఉంటాయని హెచ్చిరించింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…