Bandla Ganesh: కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి.. ప్రస్తుతం బిగ్గెస్ట్ నిర్మాతగా పేరు పొందిన వ్యక్తి బండ్ల గణేష్. రవితేజ ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్… తొమ్మిది చిత్రాల వరకు నిర్మించారు. ఇలా బండ్ల గణేష్ నిర్మాతగా మారాడు.
ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం అతడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటాడు. అయితే అతడు చేసే ట్వీట్స్ ఇటీవల కాంట్రవర్సీలకు అడ్డాగా మారుతున్నాయి.
తాజాగా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రకాశం జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చిన రూ. 1.25 కోట్ల చెక్ బౌన్స్ అయిందట.
దీంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో బండ్లగణేష్ కు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో అతడిని అరెస్టు చేసి.. కోర్డుకు హాజరు పరచాలని పోలీసులను జడ్జి ఆదేశించాడు. ఈ క్రమంలో నేడు కోర్టులో బండ్ల గణేష్ హాజరుకానున్నాడు.
అతడికి అంతకముందు ఏపీలో మరో కేసు కూడా నమోదైంది. అది కూడా ఆర్థిక వ్యవహారానికి సంబంధించింది కావడం విశేషం. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర రూ.13 కోట్లు తీసుకున్నారట. అయితే తిరిగి చెల్లించకపోవడంతో.. బండ్ల గణేష్పై కడపలో మహేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అప్పట్లో అతడికి నోటీసులు జారీ చేసినా.. స్పందించలేదు. దీంతో అప్పుడు కూడా అతడిని కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించినా వినిపించుకోలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు కడప మెజిస్ట్రేట్. ఇలా అతడు ఇదే వ్యవహారానికి సంబంధించి రెండో సారి కోర్టు ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించడం రెండోసారి కావడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…