Aruna Irani: ప్రస్తుత కాలంలో ప్రేమలు పెళ్లిళ్లు బ్రేకప్ లు జరగడం సర్వసాధారణం.ఇలా ప్రేమలో పడిన వెంటనే పెళ్లిళ్లు చేసుకోవడం ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక ఎంతో మంది విడాకులు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ వ్యవహారం ఇండస్ట్రీలో ఎక్కువగా కొనసాగుతుందని చెప్పాలి.అయితే చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి మహిళలే కారణం అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఇలాంటి వివాహేతర సంబంధాల గురించి నటి అరుణ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పచ్చని కుటుంబాలను నాశనం కావడానికి ఆడవాళ్లే కారణమని ఆరోపణలను ఈమె పూర్తిగా ఖండించారు.ఒక మహిళ తన కాపురం కూలిపోవడానికి మరొక మహిళ కారణమని తిడుతున్నారు. అయితే ఇలా తిట్టేముందు మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలని ఈమె తెలిపారు.
మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచే బాధ్యత మీ భర్తది వేరే ఆడవాళ్లది కాదు అందుకే ముందుగా మీ భర్తను అదుపులో పెట్టుకోవాలని ఈమె సూచించారు. వేరొకరి కాపురాన్ని కూల్చాలన్న ఉద్దేశంతో ఏ మహిళ కూడా అక్రమ సంబంధం పెట్టుకోదని, ఇతరుల కాపురాలు కూల్చడం మహిళలకు సరదా కాదు అంటూ మండిపడ్డారు.
ఉదాహరణకు ఈమె నటి హేమామాలిని జీవితం గురించి తెలిపారు.కేవలం ధర్మేంద్ర కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే హేమామాలిని తనని పెళ్లి చేసుకుందా అని ప్రశ్నించారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక వ్యక్తితో రిలేషన్షిప్ కొనసాగించడం అంత సులువైన విషయం కాదు.ప్రేమకు ఉన్న సెక్యూరిటీ ప్రస్తుత కాలంలో పెళ్లికి లేదని ప్రేమ లేనిచోట పెళ్లి చేసుకున్న వృధా అంటూ ఈ సందర్భంగా వివాహేతర సంబంధాల గురించి అరుణ ఇరానీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…