ప్రస్తుతం దేశంలో ఆర్యా రాజేంద్రన్ అనే్ యువతి పేరు మారుమ్రోగుతోంది. దేశంలో అతిపిన్న వయస్సులో మేయర్ పదవికి ఎంపికైన యువతిగా ఒక యువతి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరానికి ఆర్యా రాజేంద్రన్ మేయర్ కానున్నారు. సీపీఎం నుంచి పోటీ చేసిన ఆర్యా రాజేంద్రన్ విపక్ష కూటమి నుంచి సీనియర్ అభ్యర్థి బరిలో నిలిచినా విజయం సాధించారు.
అదృష్టం కలిసిరావడంతో ఆర్యా రాజేంద్రన్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు ఎన్నికలు జరగగా ఎల్డీఎఫ్ పార్టీ 516కు పైగా స్థానాలలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవల్ ముగన్ వార్డ్ నుంచి సీపీఎం తరపున ఆర్యా రాజేంద్రన్ పోటీ చేశారు.
ఎల్డీఎఫ్ పెద్దలు యువతరానికి పెద్దపీట వేయాలని భావించి ఆర్యా రాజేంద్రన్ కు మేయర్ పదవి ఇస్తున్నట్టు నేడు ప్రకటించారు. గతంలో 23 సంవత్సరాలకే మేయర్ పీఠాన్ని అధిరోహించిన రికార్డు అలహాబాద్ కు చెందిన అభిలాష గుప్తాకు ఉండగా ఆర్య ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆర్యా బీఎస్సీ మ్యాథమాటిక్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి ఆర్యాకు రాజకీయాలంటే ఎంతో ఆసక్తి.
ఆర్యా రాజేంద్రన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కూడా కావడం గమనార్హం. తనకు అతిపిన్న వయస్సులో మేయర్ పోస్టు ఆర్యా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ పోస్టులో చేరడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ఆర్యా మీడియాకు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…