తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వందల చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర ఆందోళన చెందుతుంది.
గత కొద్ది రోజుల క్రితమే కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలుజారి కింద పడడంతో ఆయన సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
1959లో సిపాయి కూతురు అనే సినిమా ద్వారా వెండితెర అరంగ్రేటం చేసినా కైకాల సత్యనారాయణ గత ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఎన్నో పాత్రల్లో నటించారు. ఈ క్రమంలో తన కెరీర్లో ఏడు వందల చిత్రాలకు పైగా నటించి మంచి ఆదరణ దక్కించుకున్నారు.
అప్పట్లో ఎస్.వి.రంగారావు తర్వాత అలాంటి పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ నేటి తరం సినిమాల్లో కూడా తాత, తండ్రి పాత్రలో నటించి నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణం చేసిన కైకాల సత్యనారాయణ ప్రస్తుతం అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలు కావడంతో ఎంతో మంది అభిమానులు తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడి తను క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…