Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయిన వారిలో బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి ఒకరు.ఈమె టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ పొందింది. ఇలా ఈమె వీడియోలు చూసినటువంటి ఎంతోమంది జూనియర్ సమంత అంటూ ప్రశంసలు కురిపించడంతో అమ్మడికి సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇలా సోషల్ మీడియాలో తనకు వచ్చినటువంటి పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ఈ విధంగా రెండు సార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన ఈమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పలు సినిమా అవకాశాలు అలాగే బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈమె సినిమాలు టీవీ షోలో కన్నా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఆషూ రెడ్డి చేసే రచ్చ మామూలుగా ఉండదు.ఒకసారి చీర కట్టుకొని అందాల ప్రదర్శన చేయగా మరికొన్నిసార్లు పొట్టి దుస్తులు ధరించి అందాలను ఆరబోస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అశోక్ రెడ్డి ఫోటోషూట్లకు ఏమాత్రం హద్దు లేదని చెప్పాలి.తాను హద్దులు అన్ని చెరిపేసి బోల్డ్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.
ఈ విధంగా ఆషూ రెడ్డి బోల్డ్ ఫోటోషూట్ చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం వెనుక ఓ కారణముందని తెలుస్తోంది. ఇలా ఈమె సోషల్ మీడియా వేదికగా బోల్డ్ ఫోటోషూట్ చేయడానికి గల కారణం కేవలం అవకాశాల కోసమేనని,సినిమాలలో అవకాశాలు అందుకోవడం కోసం ఇలా ఎక్స్పోస్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పాలి. మరి అమ్మడి అందాల ఆరబోతకు అవకాశాలు వస్తాయోలేదో తెలియదు కానీ ఆషూ రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…