Astrologer Bharath Sharma : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమం వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరచిన 39 ఏళ్ల సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. ఆయన గురించి ఆస్ట్రాలజర్ అలాగే సాయి చంద్ కు మిత్రుడైన భరత్ శర్మ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆయనకు ఆరోగ్యం గురించి ముందే హెచ్చరించాను…
భరత్ శర్మ మాట్లాడుతు సాయి చంద్ స్నేహానికి చాలా విలువ ఇస్తారంటూ చెప్పారు. ఒకసారి స్నేహం చేస్తే వారిని వదలడని పదకొండేళ్లుగా సాయి చంద్ తెలుసంటూ చెప్పారు. ఆయన మొదట జాతకాలు, దేవుళ్లను పెద్దగా పట్టించుకునేవారు కాదు. కరోనా తరువాత ఒకసారి కలవాలని చెప్పి నేను ఎమ్మెల్సి కి ట్రై చేస్తున్నా అవుతుందా అని అడిగాడు. జాతకం చూసి ఇప్పుడు రాదని చెబితే జాతకాలను నమ్మనని, నేను చెప్పింది తప్పవుతుందని ఛాలెంజ్ చేసాడు. కానీ ఎమ్మెల్సి రాకపోయే సరికి మళ్ళీ ఒకసారి పూర్తి జాతకం చూపించుకుంటాను జీవితంలో క్లారిటీ లేదని చెప్పాడు.
అప్పుడు జాతకం చూసి ఆయనకు రాజకీయాలలో అధికారం పొందే అవకాశం కన్నా అధికారం ఉన్న వాళ్ళ కింద పనులు చేసే అవకాశం కనిపిస్తోందని, ప్రస్తుతం తన జాతకం ప్రకారం రాజకీయాల గురించి ఆలోచించడం కంటే ఆరోగ్యం గురించి ఆలోచించాలని చెప్పాను. నరాలకు సంబంధించి రక్తానికి సంబంధించి అలాగే చర్మానికి సంబంధించి జాగ్రత తీసుకోవాలని చెప్పినట్లు చెప్పారు. కొన్ని ఆలయాల సందర్శన అనుకున్నాం కానీ సాయి చంద్ మీటింగ్స్ వల్ల బిజీగా ఉండటంతో కుదరలేదు. ఇంతలో ఇలా అయిపోయింది అంటూ చెప్పారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…